టాలీవుడ్ టాప్ స్టార్స్ వార్ సిద్ధమవుతోంది. యాభై రోజుల తర్వాత మొదలవ్వాల్సిన సమరం ఇప్పుడే మొదలైపోయింది. అవును నిజం.. పరిస్థితులు చూస్తే అలానే ఉన్నాయి. ఆ ఇద్దరి స్టార్స్ లో ఒకరు సూపర్ స్టార్ మహేశ్ అయితే మరొకరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వీరు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో.. సినిమాల వార్ ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి వీరిద్దరిలో సంక్రాంతి పుంజుగా ఎవరు నిలుస్తారో!

 

 

 

ఇప్పటికైతే బన్నీ రెండు పాటలు విడుదల చేసి మంచి స్పీడ్ మీద ఉన్నాడు. సామజవరగమన.. పాట యూట్యూబ్ లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎంతోమందికి కాలర్ ట్యూన్ గా మారిపోయింది కూడా. రెండో పాట రాములో.. పాట కూడా ఊపేస్తోంది. దీంతో అల వైకుంఠపురంలోపై విపరీతమైన బజ్ క్రియేట్ అయిపోయింది. నిజానికి బన్నీ తన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే తన ఆధిపత్యాన్ని చాటాడు. అప్పటి నుంచి మొదలైన వార్ లో ప్రస్తుతానికి మహేశ్ పై పైచేయిగా ఉంది. ఇటు మహేశ్ సరిలేరు నీకెవ్వరు నుంచి ఎటువంటి చప్పుడు లేదు. సంక్రాంతికి సందడి చేస్తున్నాం అంటూ ఓ పోస్టర్ మినహా ఎటువంటి సందడి లేదు. దసరా సందర్భంగా రిలీజ్ చేసిన మహేశ్ స్టిల్ పై ఎన్ని విమర్శలు వచ్చాయో తెలిసిందే. బన్నీ స్టిల్ కు మాత్రం మంచి బజ్ క్రియేట్ అయింది.

 

 

 

బన్నీ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించడంతో వీరి కాంబోలో మూడో సినిమా కావడంతో అల.. పై విపరీతమైన అంచనాలున్నాయి. అటు.. మహేశ్ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం కావడంతో అతని కామెడీ ట్రాక్ పై నమ్మకంతో యూనిట్ ఉంది. మరి ఈ రేసులో ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారో సంక్రాంతికే తేలేది.

మరింత సమాచారం తెలుసుకోండి: