టెలివిజన్ ప్రేక్షకులను  అతి ఎక్కువగా ఆకార్శిస్తున్న  షో ఢీ . ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ ఢీ షో కి  ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే విజయవంతంగా 11 సీజన్ లు కంప్లీట్ చేసుకుని 12వ సీజన్ లోకి అడుగుపెట్టింది ఢీ  షో. అయితే ఈ షో లో  ఒక్క డాన్స్ మాత్రమే కాదు అంతకు మించి అనెంతలా ఉంటుంది. అయితే ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్ లు గా కొనసాగుతున్న జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ లు ఢీ షో నుంచి వచ్చిన వాళ్లే. ఎంతో మంది డాన్సర్లను  డాన్స్ మాస్టర్ లుగా మార్చింది ఈ  షో. అయితే ఈ షోలో యాంకరింగ్ చేసే ప్రదీప్ షో కి స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాడు. అంతేకాకుండా సుధీర్ రష్మి గౌతమ్ రొమాంటిక్ కామెడీ కూడా ఈ షో కి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అనే చెప్పాలి. 

 

 

 

 ఇక ఢీ  చూసే ప్రేక్షకులందరికీ గుర్తొచ్చేది అదిరిపోయే డాన్సులు... సుధీర్ రష్మి గౌతమ్ ల మధ్య జరిగే రొమాంటిక్ కామెడీ.... వీళ్లిద్దరి మధ్య  ఆటో పంచులు వేస్తూ అందరిని కడుపుబ్బా నవ్వించే ప్రదీప్ యాంకరింగ్ . ఢీ  పేరు తీయగానే ఇవన్నీ ఠక్కున గుర్తు వస్తాయి. అయితే తాజాగా ఢీ షోకి  ఓక స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్న ప్రదీప్ షో  నుంచి తప్పుకోవడం... టీమ్ లీడర్గా ఉన్న సుధీర్ రష్మీ యాంకర్ గా మారడం సడన్ గా అందరినీ షాక్ కి గురిచేసింది. అయితే ఈ షో యాంకరింగ్ నుంచి ప్రదీప్ తప్పుకోవటానికి గల కారణాలు ఏంటి అనే దానిపై ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. 

 

 

 

 ఢీ 2 సీజన్లకు యాంకర్ గా  వ్యవహరించిన ప్రదీప్ తనదైన స్టైల్లో రక్తి కట్టించి అందరిని ఆకర్షించారు. అయితే ఈసారి ప్రదీప్ తన రెమ్యునరేషన్ని కాస్త పెంచేశాడట... దీంతో మల్లెమాల  వాళ్లు ప్రదీప్ కోరినంత రెమ్యూనరేషన్ ఇవ్వలేమని చెప్పినట్లు సమాచారం. అయితే ప్రదీప్ కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ పెంచేసి డిమాండ్ చేయటంతో ... అది మల్లెమాల వాళ్ల చెల్లించక పోవడం వల్లనే షో నుంది ప్రదీప్  తప్పుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఢీ షోలో  రష్మి సుధీర్ జోడి కూడా బాగా హైలెట్ అవుతుండడంతో... ప్రదీప్ షో నుంచి తప్పుకోవటానికి ఓ కారణం అని  అందరూ గుసగుసలాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: