జూనియర్ ఎన్టీఆర్ పక్కన నటించే అవకాశం కోసం చాలా మంది హీరోయిన్స్ లైన్ కడతారు.. ఎన్టీఆర్ మువీ లో నటిస్తే చాలు మంచి గుర్తింపు వస్తుంది. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు అయినా సమీరారెడ్డి... మీకు గుర్తుందా? అదేనండి అశోక్ మూవీ మరియి నరసింహ సినిమా లో ఎన్టీఆర్ పక్కన నటించిందే తానే సమీరారెడ్డి.


    ఒక పదేళ్లు వెనక్కివెలితో అశోక్ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా లో నటించి వార్తల్లో కెక్కింది.. ఎన్టీఆర్ సమీరాతో  ప్రేమలో పడ్డాడని, పెళ్లి కూడా చేసుకుంటాడని అప్పట్లో ఒక ప్రచారం కూడా జరిగింది. కానీ కొన్ని రోజులకి అంత మరిచిపోయారు.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో జై చిరంజీవా సినిమాలో ఒక హీరోయిన్ గా కూడా చేసింది. కానీ తెలుగులో తనకి అనుకున్న విజయం రాలేదు.. సమీరా చేసిన మూడు సినిమాలు యావరేజ్ గా నిలిచాయి సమీరాకి స్టార్ డమ్ ఇవ్వలేదు.

 


   తర్వాత బాలివుడ్ కి వెళ్లి కొన్ని సినిమాలు చేసింది కానీ అక్కడ కూడా ఆశించినంత విజయాలు రాలేదు. సినిమాలో ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. దానితో సమీరా ఇంకా పెళ్ళిచేసుకోవాలని నిర్ణయం తీసుకుని 2014 లో అక్షయ్ వర్ధే అనే బిజినెస్  మాన్ ని పెళ్ళిచేసుకున్నది. 2015 లో ఒక బాబు కి జన్మనిచ్చింది. ఇపుడ ఈ ఏడాది మళ్ళీ ఒక పండంటి ఆడపిల్ల కి జన్మనిచ్చింది.. ఇపుడు తన కూతురే తన లోకం అంటుంది ఈ ముద్దగుమ్మ.


    పెళ్లి తర్వాత సినిమాలకి దూరం అయింది. అపుడపుడు ఈవెంట్స్ కి మాత్రమే వస్తుంది.. తాజాగా తన కూతురితో ఫొటోస్ దిగి పోస్ట్ చేసింది.. కానీ ఎవరు తాను సమీరా రెడ్డి అని గుర్తుపట్ట లేని విధంగా బరువు పెరిగింది. కూతురు పుట్టాక మరింత బరువు పెరిగానని తెలియచేసారు ఈ అందాలతార. 

మరింత సమాచారం తెలుసుకోండి: