బుల్లితెర ప్రేక్షకులకి రష్మీ-సుధీర్ లను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వీళ్ళ జోడికి, ఈ జోడి మధ్య కెమిస్ట్రీకి చాలా క్రేజ్ ఉంది. ఈ జోడి ఏ షోలో కనిపిస్తే ఆ షో పక్క హిట్. రేటింగులు కూడా హై లెవెల్ కి వెళ్లిపోతాయి. అందుకే దర్శకనిర్మాతలు వీళ్లతోనే ఎక్కువ షోలు ప్లాన్ చేస్తూ ఉంటారు. వీళ్లిద్దరి మధ్య ఎదో జరుగుతుందని సోషల్ మీడియాలో ఎప్పుడు ఎదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఆన్ స్క్రీన్ మీద వీళ్ళ కెమిస్ట్రీ చూస్తే, ఒక్కోసారి ఆ వార్తలు నిజమేనా అని అనిపిస్తుంది. అలా ఒకరివల్ల ఒకరికి బాగానే క్రేజ్ వచ్చింది. ఎవరి వల్ల అయితే సుధీర్ పాపులర్ అయ్యాడో, వాళ్ళనే ఇప్పుడు వదిలేస్తున్నాడా అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

 

అసలు విషయం ఏమిటంటే, ఇటీవల జరిగే ఏ ఈవెంట్ లోనూ సుధీర్ పక్కన రష్మీ ఉండటం లేదు. ఆమె స్థానంలో విష్ణు ప్రియ, వర్షిణిలు కనిపిస్తున్నారు. తాజాగా జరిగిన ఈటీవీ ఉగాది ఈవెంట్ 'పండగ సార్ పండగ అంతే' లో అసలు రష్మీ జాడేలేదు. కేవలం సుధీర్ ని మాత్రమే ప్రధానంగా పెట్టి ఈ షోని నడిపించారు. పైగా ఇందులో సుధీర్ సోలోగా ఒక స్పెషల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అది కూడా బాలయ్య సినిమాలోని  'స్వాతిలో ముత్యమంత' అనే వాన పాట. మామూలుగానే సుధీర్ డాన్స్ ఇరగదీస్తాడు. అలాంటిది ఇలాంటి రొమాంటిక్ పాట అంటే ఎలా చేస్తాడో పెద్దగా చెప్పనక్కర్లేదు. ఢీ ఛాంపియన్స్ షోలోని డాన్సర్ తో సుధీర్ ఈ పాటకు స్టెప్పులేశాడు.  అందుకు సుధీర్ కి మంచి ప్రశంసలు లభించాయి.

 

 కానీ రష్మీ-సుధీర్ జోడి ఫ్యాన్స్ మాత్రం చాలా హర్ట్ అవుతున్నారు. సుధీర్ పక్కన రష్మీ లేకపోవడం వాళ్లకు అస్సలు నచ్చడం లేదట. ఇలాంటి వాన పాటలో సుధీర్ పక్కన రష్మీ ఉండుంటే చాలా బాగుండేదని వారి అభిప్రాయం. ఇక్కడ సుధీర్ రష్మిని వదిలేసాడని ఫాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. ఇకనైనా సుధీర్ తర్వాత ఈవెంట్లో రష్మితో కలిసి చేస్తాడో, లేక మళ్ళీ వదిలేస్తాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: