తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ చిత్రం జాతీయ స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.  ఈ మూవీ సీక్వెల్ ‘బాహుబలి 2’ అయితే ఏకంగా జాతీయ స్థాయిలో కలెక్షన్ల పరంగా రికార్డు మోత మోగించింది.  ఈ మూవీలో బాహుబలి గా నటించిన ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.  ఇప్పుడు మనోడు జాతీయస్థాయి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీలు ప్లాన్ చేస్తున్నారు.  ప్రస్తుతం రాధాకృష్ణ ద్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ మూవీ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  వైజయంతీ మూవీస్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించే ఈ చిత్రంలో కథానాయికగా పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.  ఈ మూవీలో బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ ని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు సమాచారం.

 

సాధారణంగా టాలీవుడ్ స్టార్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం అన్నది దర్శక నిర్మాతలకు మామూలు విషయం కాదు. ఒకవేళ ఆ హీరోయిన్లు ఓకే అన్నా భారీ పారితోషికం అడుగుతుంటారు.. అంతే కాదు వారి కాల్షీట్స్ విషయంలో కూడా ఎన్నో కండీషన్లు పెడుతుంటారు.  బాలీవుడ్ బ్యూటీస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు దర్శక, నిర్మాతలు.  అందుకే, హీరోయిన్ ఎంపిక అన్నది ఓ పట్టాన సెట్ కాదని అంటుంటారు.

 

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. ఈ మూవీలో అలియా భట్ పేరు వినిపిస్తుంది.. అంతే కాదు ఇప్పటికే ఆమెను సంప్రదించినట్టు, ఈ ప్రాజక్టు చేయడానికి ఆమె సుముఖంగా వున్నట్టు సమాచారం. లాక్ డౌన్ ముగియగానే దర్శకుడు నాగ్ అశ్విన్ ముంబై వెళ్లి అలియాకు కథ చెప్పనున్నట్టు తెలుస్తోంది. కాగా, అలియా ప్రస్తుతం తెలుగులో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే!

మరింత సమాచారం తెలుసుకోండి: