కాలేజ్ స్టూడెంట్ అయిన సూర్య (మంచు మనోజ్) కాలేజ్ లో ముగ్గురమ్మాయిలు ఆత్మహత్య చేసుకోగా దాని మీద నిరసనకు దిగుతాడు. విద్యార్ధి నాయకుడిగా ఉన్న సూర్య ఈ విషయం మీద ఉద్యమానికి దిగుతాడు. ఈ టైంలో అతనికి స్వర్ణ (అనీషా ఆంబ్రోస్) రిపోర్టర్ సహాయం తీసుకుంటాడు. ఆత్మహత్యలకు కారణమైన మినిస్టర్ సూర్యను అరెస్ట్ చేయించి ఎంకౌంటర్ చేయించేలా ప్లాన్ చేస్తాడు. వార్ని భారి నుండి సూర్య ఎలా ఎస్కేప్ అయ్యాడు..? ఇక ఈ కథలో పీటర్ ఎలా వచ్చాడు..? అసలు అతను ఎవరు అన్నది అసలు కథ.
రెండు పాత్రల్లో మంచు మనోజ్ నటన అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఎప్పుడు జోవియల్ పాత్రలో ఆకట్టుకునే మంచు కుర్రాడు ఈసారి ఫుల్ లెంథ్ సీరియస్ రోల్ లో నటించాడు. విధ్యార్ధి నాయకుడిగానే కాదు పీటర్ గా కూడా చాలా బాగా నటించాడు. ఇక సినిమాలో మరో ప్రముఖ పాత్ర అజయ్ ఆండ్రూస్ బాగా నటించాడు. హీరోయిన్ అనీషా పర్వాలేదు అనిపిస్తుంది. పోసాని సిన్సియర్ కానిస్టేబుల్ పాత్రలో ఆకట్టుకోగా సుహాసిని, మిలింద్ గునాజి పాత్రలు ఆకట్టుకున్నాయి.
సినిమా దర్శకుడు అజయ్ ఆండ్రోస్ కథ కథనాల్లో ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. శ్రీలంకలో ఉండే శరణార్ధులు ప్రత్యేక దేశం కోసం పోరాడగా వారికి అండగా నిలిచిన ఎల్టిటి చీఫ్ ప్రభాకరణ్ జీవితంలో కొన్ని ఘట్టాలని ఈ సినిమాలో తీసుకున్నాడు. కథను యాక్సెప్టబుల్ గా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సినిమాటోగ్రఫీ ఓకే. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండాల్సింది. మ్యూజిక్ సోసోగానే అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నాయి.