చిన్నప్పటి నుండి దొంగతనం అనే వింత రోగంతో బాధపడుతుంటాడు రాజ్ (రాజ్ తరుణ్). తనకున్న ఈ వ్యాధి గురించి ఎవరికి చెప్పడు. ఇక మనసుకి నచ్చిన అమ్మాయి తన్వి (అమైరా దస్తర్)ను చూసి ఇష్టపడతాడు. ఆమె కూడా రాజుని ఇష్టపడుతుంది. ఇద్దరు ప్రేమని ఇంట్లో వారికి చెప్పి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతారు. ఈ తరుణంలో తన్వి తాత నాగినీడు దగ్గరకు ఓ 10 రోజులు ఉండేలా వెళ్తారు రాజు, తన్వి. తన్వి తాతకు దొంగతనం చేసే వారంటే కోపం చిన్న దొంగతనానికే పెద్ద శిక్ష వేస్తాడు. ఇక అలాంటి ఇంట్లో తన్వి తాతాకి దొరక్కుండా రాజు ఎలా తప్పించుకున్నాడు. చివరకు ఆమెని ఎలా దక్కించుకున్నాడు అన్నది సినిమా కథ.
రాజ్ తరుణ్ హీరోగా తనవరకు బాగానే చేశాడు. అయితే కుర్రాడిలో ఇదవరకు ఉన్న జోష్ ఈ సినిమాలో కనిపించలేదు. అమైరా దస్తర్ అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర చేయలేదు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నాగినీడు, సితార, ప్రవీణ్ సినిమాలో పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
సినిమా కెమెరా వర్క్ బాగానే అనిపిస్తుంది. గోపి సుందర్ మ్యూజిక్ బాగుంది. దర్శకురాలు సంజనా రెడ్డి కథ, కథనాలు ఏమంత కొత్తగా అనిపించవు. సినిమా అంతా రొటీన్ పంథాలో సాగుతుండటం జరుగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ ఇంకాస్త ట్రిం చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.