రాజ వంశానికి చెందిన వారసురాలైన ధరణి (రియా సుమన్) బిటెక్ చదువుతూ పార్ట్ టైంగా పేపర్ గా పనిచేస్తున్న రవి (సంతోష్ శోభన్)ను చూసి ఇష్టపడుతుంది. రవి కూడా ధరణిని ఇష్టపడతాడు. ధరణి తల్లిదండ్రులు కూడా వారి ప్రేమను అంగీకరిస్తారు అయితే అనుకోకుండా రవి, ధరణిలు దూరమవుతారు. రవి, ధరణిల మధ్య ఏం జరిగింది..? వారు దూరమవడానికి కారణాలేంటి..? వీరి ప్రేమకథకు ముంబైలో ఉండే మేఘ (తన్య హోప్)కు సంబందం ఏంటి అన్నది సినిమా కథ.
హీరోగా సంతోష్ శోభన్ రెండో సినిమా అయినా బాధ్యత గల పౌరుడిగా మంచి రోల్ చేశాడు. సినిమాలో అతని అభినయానికి అందరు ఫిదా అవుతారు. రవి పాత్రకు సంతోష్ శోభన్ పర్ఫెక్ట్ అనిపించాడు. ఇక రియా సుమన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. సినిమాలో ఎక్కువ సీన్స్ హీరో హీరోయిన్ మధ్య ఉంటాయి. అవి కూడా అలరించేలా ఉన్నాయి. తన్య హోప్ పాత్ర చిన్నదే అయినా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. నాగినీడు, విద్యుల్లేక, మహేష్, బితిరి సత్తి ఇలా అందరు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఆకర్ష్ణణ అని చెప్పొచ్చు. భీమ్స్, బొబ్బిలి సురేష్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్లస్ అని చెప్పొచ్చు. కథ, కథనాలు కొత్తగా ఏమి లేకునందా ఉన్నంతవరకు కాస్త నీట్ గానే ప్రెజెంట్ చేయగలిగాడు జయశంకర్. ఇక ఈ సినిమాకు సంపత్ నంది రచన హెల్ప్ అయ్యింది. సంపత్ నంది నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.