నిహారిక టాలీవుడ్ ఎంట్రీ గురించి ఇంకా అందరూ ఎదురు చూస్తూ ఉండగానే మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది నిహారిక. అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను మొదలు పెట్టింది. ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా యూట్యూబ్ సీరీస్ కు ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమాలను  రూపొందించబోతోంది నిహారిక. 

లేటెస్ట్ గా ఆమె ‘ముద్దపప్పు ఆవకాయ' పేరుతో యూట్యూబ్ కోసం ఒక సిరీస్ ను తయారు చేయబోతోంది. డానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిన్న విడుదల చేసారు. అంతేకాదు ‘ముద్ద పప్పు ఆవకాయ' ట్రైలర్ ను కూడ నాగబాబు నిన్న సాయంత్రం విడుదల చేసాడు. ఈ ట్రైలర్ చాలామందికి నచ్చింది అన్న వార్తలు అప్పుడే వస్తున్నాయి. 

నిహారిక క్లోజ్ ఫ్రెండ్ ప్రణీత్ బ్రామందపల్లి దర్శకత్వంలో ‘ముద్దపప్పు ఆవకాయ' పేరుతో యూట్యూబ్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. ‘ముద్దపప్పు ఆవకాయ'లో నిహారిక ఆశా పాత్రలో మెయిన్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమృతం సీరియల్ తరహాలో ‘ముద్ద పప్పు ఆవకాయ' అనేది ఎంటర్టెన్మెంట్ సిరీస్ గా నడుస్తుంది అని టాక్. 

దీనికి సంబంధించిన వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి అని తెలుస్తోంది. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డిగ్రీ చేసిన నిహారిక ఇప్పటికే యాంకర్ గా తన సత్తాను చాటుకుని త్వరలోనే హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నేపధ్యంతో పాటు ఇలా ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో నిహారిక కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించడం టాలీవుడ్ కు హాట్ న్యూస్ గా మారింది. ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు ప్రొడక్షన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిహారికను చూస్తూ ఉంటే ఈ మెగా డాటర్ రానున్న రోజులలో చాల సంచలనాలు చేస్తుంది అనడంలో సందేహం లేదు..


మరింత సమాచారం తెలుసుకోండి: