మెగాస్టార్ వారసుడిగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు..మొదటి సినిమాతోనే మంచి నటన కనబరిచిన వరుణ్ రెండవ సినిమా క్రిష్ దర్శకత్వంలో  ‘కంచె’ చిత్రంలో నటించాడు.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'లోఫర్‌'.  పూర్తి కమర్షియల్, సెంటిమెంట్, మాస్ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇది వరుణ్‌ తేజ్‌కు మూడో చిత్రం. సీకే ఎంటర్‌టైమెంట్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  సి.కళ్యాణ్ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శర వేగంగా జరుగుతున్నాయి.


ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 18 డిసెంబర్ న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు తేదీ త్వరలో వెల్లడిస్తారట. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని నిన్న రివీల్ చేసారు.ఈ ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా ‘లోఫర్’ ట్రైలర్ విడుదల చేశారు. పూరీజగన్నాథ్ టేకింగా చాలా బాగుంది అనిపిస్తుంది.. ట్రైలర్ లో వరుణ్ చాలా రఫ్ గా కనిపిస్తున్నాడు. ఫైట్స్, డ్యాన్స్ తో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. అమ్మ సెంటిమెంట్ తో రాబోతున్న ఈ చిత్రం వరుణ్ తేజ ఖాతాలో మరో సూపర్ డూపర్ హిట్ అవుతుందని అంటున్నారు.


లోఫర్ పోస్టర్స్


ఇప్పటికే ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.  ఈ చిత్రంలో రేవతి, పోసాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మానందం, రేవతి, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో చరణ్ దీప్‌ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.  ఈ చిత్ర ఆడియో సునీల్ కశ్యప్ మ్యూజిక్ దర్శకత్వంలో రూపొందించబడుతుంది.సీ.కళ్యాణ్ నిర్మాణంలో ఈ చిత్రం నిర్మించబడుతుంది.ఈ చిత్రంలో వరుణ్ సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది.దర్శకుడు ఈ చిత్రాన్ని ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించారు.ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: