హీరో నాగార్జున భార్య అమలకు యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రవర్తన షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.  అమలకు నటిగా నాగార్జున భార్యగా వచ్చిన గుర్తింపు కంటే జంతు ప్రేముకురాలిగా ‘బ్లూ క్రాస్’ సంస్థ కార్యక్రమాల నిర్వాహకురాలిగా వచ్చిన గుర్తింపు ఎక్కువ. టాలీవుడ్ లో అమలకు పోటీగా మరో జంతు ప్రేమికుడు వచ్చాడని వార్తలు వస్తున్నాయి. 

వరస హిట్లతో దూసుకు పోతున్న రాజ్ తరుణ్ కు జంతువులు ముఖ్యంగా కుక్క పిల్లలు అంటే చాల ఇష్టం అట. అయితే ఖరీదైన అందమైన కుక్క పిల్లలను కొనుక్కుని పెంచుకోకుండా వీధి కుక్కలను చేరదీసి వాటికి వైద్యం చేయించడం అవి జబ్బుపడితే  జాగ్రత్తగా చూసుకోవడం రాజ్ తరుణ్ కు ఇష్టమైన విషయాలలో ఒకటి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఇటీవల రాజ్ తరుణ్ ఒక కుక్కకు వైద్యం చేయించడం కోసం రాత్రంతా ఆసుపత్రిలో గడిపాడని టాక్. 

ప్రస్తుతం రాజ్ తరుణ్ కు ఉన్న సంపాదన రీత్యా ఖరీదైన అపార్ట్ మెంట్ తీసుకోగలిగినా తన అలవాటు ఇతరులకు సమస్యగా మారుతుందని ఒక  ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నట్లు టాక్. అంతేకాదు ఇతడి ఇంటిలో చెప్పుకోతగ్గ సంఖ్యలో కుక్క పిల్లలు కనిపిస్తూ ఉండటంతో అమలకు పోటీగా మరో యంగ్ హీరో వచ్చాడు అంటూ రాజ్ తరుణ్ పై సెటైర్లు పడుతున్నాయి. 

ఈ వార్తలు ఇలా ఉండగా గతవారం విడుదలైన ‘కుమారి 21 ఎఫ్’ సూపర్ హిట్ అవడంతో రాజ్ తరుణ్ రేంజ్ కోటి రూపాయల స్థాయికి చేరిపోయింది అని అంటున్నారు. రాజ్ తరుణ్ సాధిస్తున్న వరుస విజయాలతో టాలీవుడ్ యంగ్ హీరోలు నాని, నాగచైతన్య, వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ లు తమకు గట్టి పోటీ రాజ్ తరుణ్ నుండి ఏర్పడింది అంటూ ఆ హీరోలు తమ సినిమాల విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: