టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ ఎంట్రితో డెబ్యూ హీరోగా పరిచయం అయిన హీరో అక్కినేని అఖిల్. ఈ మూవీ రిలీజ్ తరువాత డిజాస్టర్ రిజల్ట్ ని  చూసిన ప్రతి ఒక్కరు అఖిల్ ని టార్గెట్ చేసుకుంటూ తూటాల్లాంటి మాటలని వదులుతున్నారు. ఇక తాజాగా అఖిల్ హీరోయిన్ సైతం, హీరోగారిని మరీ ఛీపుగా తీసివేయటం ఎవ్వరూ ఊహిచని షాక్ గా మారింది. ఒక్క అఖిల్ హీరోయిన్ మాత్రమే కాకుండా, ఇతర హీరోయిన్స్ సైతం అఖిల్ ని పెద్దగా లెక్కలోకి తీసుకోకపోవటంతో ఇప్పడు అఖిల్ మూవీలకి పెద్ద చిక్కే వచ్చింది.


మహేష్ బాబు తరువాత మహేష్ బాబు లాంటి వాడని అందరూ తెగ గాలి నింపేస్తే...ఇప్పుడు మహేష్ బాబుకి అఖిల్ కి ఎంతో తేడా ఉందంటూ వారే గాలిని తీసేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హీరో చాలా తెలివిగా ఆలోచించి..మీడియాకు పెద్దగా ఎక్స్ పోజ్ కావటం లేదు. ఇదిలా ఉంటే తాజాగా అఖిల్ హీరోయిన్ సయోషా మాట్లాడిన మాటలను ఓ సారి చూస్తే...‘ఈ సినిమాలో లీడ్ పెయిర్ అయినా నాకు,అఖిల్ కి మధ్య ఇంకొన్ని ఎమోషనల్ అలాగే రొమాంటిక్ సన్నివేశాలను పెడితే సినిమాకి గ్లామర్ లుక్ వచ్చేది. 

అసలు మా ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ అనేవే లేకపోవటంతో సినిమా బోరింగా ఉంది.’ అంటూ సయేషా పెద్ద బాంబే పెల్చింది. దీంతో వినాయక్ సైతం ఈ అమ్మడు ఇచ్చిన సలహాలను జీర్ణించుకోలేకపోతున్నాడంట. అంతే కాకుండా అఖిల్ ని సైతం ఈ బ్యూటీ చాలా ఛీపుగా చూస్తుందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి.


ఇక అఖిల్ కి తెగ గ్లామర్ ఫాలోయింగ్ ఉందనుకుంటున్న చాలా మంది హీరోయిన్స్, ఇండస్ట్రీ మార్కెట్ లో అఖల్ కి డిమాండ్ లేదని తెలిసి...ఏ హీరోయిన్ ఈ హీరోకి అంతగా టచ్ లోకి రావటం లేదు. పెద్ద హీరోయిన్స్ అయితే అఖిల్ ని పూర్తి లైట్ తీసుకున్నారు. సమంత, తమన్న వంటి హీరోయిన్స్ తో రొమాన్స్ చేద్దాం అనుకున్న అఖిల్ కి ఇది నిరాశనే మిగిల్చిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: