పవన్ కళ్యాణ్ దాసరిల సినిమా వచ్చే సంవత్సరం ప్రారంభం అవుతుంది అన్న సంకేతాలు ఇప్పటికే ఉన్నాయి. దీనితో ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు అన్న విషయం పై ఇప్పటికే రకరకాల ఊహగానాలు ఉన్నాయి. ఈ పరిస్థుతుల నేపధ్యంలో దాసరి వద్దకు ఒక కొరియోగ్రాఫర్ నడిపిన రాయబారం దాసరిని ఆశ్చర్య పరిచినట్లు టాక్. 

ఆ శక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ఇప్పటికే టాలీవుడ్ సినిమా రంగంలో మంచి కొరియోగ్రాఫర్ గా ఎదుగుతున్న జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు ఒక మంచి కథను వినిపించాడట. ఆ కథ పవన్ కు బాగా నచ్చడంతో ఆ కథను సినిమాగా తీసే విషయంలో జానీ మాష్టర్ కు దర్శకుడిగా అవకాశం తాను కలిగిస్తానని అయితే నిర్మాతను వెతుక్కో అని చెప్పాడట పవన్. 

అయితే ఈ అనుకోని వారానికి షాక్ అయిన జానీ మాష్టర్ పవన్ తో సినిమాను చేయాలని ప్రయత్నిస్తున్న దాసరిని కలవడం ఈ కథను వినిపించడం జరిగి పోయింది అన్న వార్తలు కూడ వస్తున్నాయి. ‘రేసు గుర్రం’, ‘జులాయి’, ‘రచ్చ’ ‘ఎవడు’ లాంటి భారీ సినిమాలకు జానీ మాష్టర్  కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఇతడు పవన్ డైరెక్ట్ చేసే దర్శకుడిగా మారుతున్నాడన్న వార్త టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ ఫిబ్రవరితో పూర్తి అవుతుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈసినిమా తరువాత పవన్ దాసరి జానీ మాష్టర్ల కాంబినేషన్ లో సినిమా ఉంటుందా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గబ్బర్ సింగ్ సెంటిమెంట్ తో గతంలో ఈసినిమా విడుదలైన మే నెలలో విడుదల అవుతుంది అన్న వార్తలు వస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: