మళియాళీ ఇండస్ట్రీలో తన అందచందాలతో మురిపించి మై మరపించే నటి మంజువారియర్ అంటే తెలియని వారు ఉండరు. ఈ అమ్మడి చిత్రాలు చూసి అభిమానులే కాదు మళియాళీ ఇండస్ట్రీలవాళ్లు సైతం మంచి కితాబు ఇచ్చారు.  ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో నటించి, ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకుంది.  అయితే గత కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు ఇటీవలే ‘హౌ ఓల్డ్ ఆర్ యూ’  సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.

తాజాగా ఈ అమ్మడిపై ఓ ట్రైనీ పోలీస్ అధికారి కామెంట్స్ చేసి సస్పెండ్ కావడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. ఈ మద్య రీ ఎంట్రీ ఇచ్చిన మంజువారియర్ తన సహనటుడు సూరజ్ వెంజరమూద్ తో కలిసి ఓ ఫోటో ను సోషల్ మీడియా ఫేస్ బుక్ లో లోడ్ చేసింది.

అయితే ఈ ఫోటోపై చాలా మంది పాజీటీవ్ గా స్పందించినా ఓ ట్రైనీ పోలీస్ అధికారి మాత్రం అసభ్యకరమైన కామెంట్స్ చేసాడు. దీంతో ఈ అమ్మడికి చిర్రెత్తుకొచ్చింది..వెంటనే  ఈ విషయాన్ని కేరళ డీజీపికి ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ జరిపిన డిజిపి సేన్ కుమార్ సదరు ట్రైనీ అధికారి రెంజుమన్ ను సస్పెండ్ చేసారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: