పు విడుదల అవుతున్న ‘నాన్నకు ప్రేమతో’ ఆ సినిమా టాక్ ఇంకా బయటకు రాకుండానే ఒక విషయంలో ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేసింది అని వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఈసినిమా రేపు నైజాం ఏరియాలో 400 స్క్రీన్స్ లో విడుదల కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీటి సంఖ్యతో పాటుగా నైజాం డిస్ట్రిబ్యూటర్స్ మరో 40 స్క్రీన్స్ ను నైజాం ఏరియాలో కలుపబోతున్నారు అని టాక్.  

దీనితో 440 స్క్రీన్స్ లో నైజాంలో విడుదల అవుతున్న సినిమాగా జూనియర్ ‘నాన్నకు ప్రేమతో’ మారబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  గతంలో ‘బాహుబలి’ నైజాం ఏరియాలో 420 థియేటర్లలో రిలీజైన విషయాన్ని జూనియర్ అభిమానులు గుర్తుకు చేస్తూ విడుదల కాకుoడానే తమ జూనియర్ సినిమా ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేసిందని పండుగ చేసుకుంటున్నారు. ఇంత భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి వేరే  కారణాలు ఉన్నాయి  అనే వార్తలు కూడ వస్తున్నాయి. 

14న ‘డిక్టేటర్’, 15న ‘సోగ్గాడే చిన్నినాయన’ విడుదల అవుతూ ఉండటంతో వీలైనంత ఎక్కువ ఫ్రింట్స్‌ తో తొలిరోజు ‘నాన్నకు ప్రేమతో’ ను విడుదల చేసి భారీ ఓపెనింగ్స్ రాబట్టాలన్నది ప్రొడ్యూసర్ ప్లాన్ అని అంటున్నారు. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా 190 స్ర్కీన్స్‌లో విడుదల అవుతోంది.  హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని 7 థియేటర్స్ లో విడుదలచేయడం సంచలనంగా మారింది.  

దీనిని బట్టి చూస్తూ ఉంటే  మొదటి రోజునే జూనియర్ సినిమా రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా జూనియర్ ఈ సినిమాలో ‘హోవర్ బోర్డ్’ పై తాను చేసిన సాహసాలు ఎవరూ తన సినిమాను చూసి చేయవద్దని అలా చేయడానికి చాల ప్రాక్టీస్ చేయాలని సినిమా షూటింగ్ సమయంలో తానే బ్యాలెన్స్ నిలుపుకోలేక నాలుగైదు సార్లు పడిపోయానని చెపుతూ ఈ విషయంలో తల్లితండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని కోరుతూ జూనియర్ ఒక ఇంటర్వ్యూలో తెలుయచేసాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ‘నాన్నకు ప్రేమతో ఫీవర్ ప్రేక్షకులకు బాగా సోకింది అనే అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: