టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని దర్శకులని ఫిల్టర్ చేస్తే…పాషన్ ఉన్న డైరెక్టర్స్ కొద్ది మంది మాత్రమే ఉంటారు. మిగతా వారంతా కమర్షియల్ డైరెక్టర్స్ మాత్రమే. సినిమాని కమర్శియల్ హంగుల కోసం కాకుండా, విలువల కోసం తెరకెక్కించే వారు ఇంకా తక్కువ మందే ఉంటారు. అటువంటి వారిలో శేఖర్ కమ్ముల ఒకరు. ప్రస్తుత సమయంలో శేఖర్ కమ్ముల పరిస్థితి అంతగా డిమాండ్ లేని పొజిషన్. ఎందుకంటే తను, తన సినిమాలతో ప్రేక్షకుల మదిలో చిరకాలం గుర్తుండిపోవాలని కోరుకుంటాడు.


కానీ ప్రస్తుతం పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో స్టార్ హీరోలు, యంగ్ హీరోలు…నిర్మాతలు ఎవ్వరూ శేఖర్ కమ్ములతో పయనించటానికి సాహసించటం లేదు. కానీ ఒక్క సూపర్ స్టార్ మహేష్ మాత్రం శేఖర్ కమ్ముల కి మాట ఇచ్చాడు. త్వరలోనే మూవీ అంటున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను చూస్తే…‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, శేఖర్ కమ్ములతో మూవీని చేస్తానని చెప్పుకొచ్చాడు.


అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకూ ఎంత లైన్ లోకి వచ్చిందనేది ఎవ్వరికి తెలియదు. శేఖర్ కమ్ముల సైతం మహేష్ బాబుతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నానని, కథ కూడా సిద్దం చేస్తున్నానని చెప్పాడు. అయితే తాజా వివరాల ప్రకారం, వీరిద్దరి మధ్య కంటిన్యూస్ గా చర్ఛలు మాత్రం జరుగుతున్నాయి. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే…మహేష్ బాబు, శేఖర్ కమ్ముల సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు.


మహేష్ తో శేఖర్ కమ్ములకి మంచి అనుబంధం ఉంది. మహేష్ ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత మురుగదాస్ తో సినిమా ఉంటుంది. ఆ తర్వాతే మహేష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: