గతనెల సంక్రాంతి సినిమాల రేసులో విజేత ఎవ్వరో తేలిపోయిన తరువాత అందరి దృష్టి ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల సమ్మర్ రేస్ పై పడింది. ఈ సమ్మర్ రేస్ విజేత ఎవరూ అని అంచనాలు వేస్తూ ఉంటే ఆ అంచనాలకు బ్రేక్ వేస్తూ మోగ్లీ చేయబోతున్న సంచలనం హాట్ న్యూస్ గా మారింది. హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ తీసే చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న నేపధ్యం తెలిసిందే. 

గతంలో ఈ సంస్థ ‘జంగిల్ బుక్’ అంటూ ఓ యానిమేషన్ మూవీతో సృష్టించిన సంచలనాలు మరిచిపోఎవి కావు. ఇప్పుడు అదే స్టోరీతో రియల్ లైఫ్ కేరక్టర్లతో హాలీవుడ్ లో ఒక సినిమా రాబోతోంది. ‘మోగ్లీ’ అంటూ తీస్తున్న చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఏప్రియల్ 15న ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు వాల్ట్ డిస్నీ ప్రకటించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన మోగ్లీ ట్రైలర్ ను ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల మంది చూశారంటే ఈమూవీకి ఉన్న క్రేజ్ అర్ధమవుతుంది. 

నీల్ సేథి అనే బాల నటుడు మోగ్లీగా నటిస్తున్న ఈసినిమాకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఈసినిమాను తెలుగులో డబ్ చేసి ఏప్రియల్ 15న విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ టాప్ హీరోలకు షాకింగ్ గా మారింది అని టాక్. ఇదే ఏప్రియల్ ను టార్గెట్ చేస్తూ పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మహేష్ ‘బ్రహ్మోత్సవం’ అల్లుఅర్జున్ ‘సరైనోడు’ సినిమాలు విడుదల అవుతున్న నేపధ్యంలో ఈ సినిమాల కలెక్షన్స్ పై ఈ మోగ్లీ ఎంతో కొంత ప్రభావం చూపెడుతుంది అని అంటున్నారు.   

ఇప్పటికే ఈసినిమా అవతార్ రేంజ్ లో ఉంటుంది అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈసినిమా ప్రభంజనం వల్ల పవన్ మహేష్ బన్నీలకు షాక్ తగలడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: