కోలీవుడ్ టాప్ డైరెక్టర్ పి. వాసు స్కెచ్ లో నాగార్జున రజని కాంత్ లు పడబోతున్నారా ? అన్న సందేహాలు కలుగు తున్నాయి. దీనికి కారణం కన్నడంలో సూపర్ హిట్ అయిన హర్రర్ ధ్రిల్లర్ మూవీ ‘శివలింగ’ అని అంటున్నారు. కన్నడంలో హీరో శివరాజకుమార్, వేదిక, శక్తి వాసుదేవన్ లతో చేసిన ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అయ్యింది.  

గత వారం పిభ్రవరి 12వ తేదీన విడుదలైన ఈ చిత్రం కర్ణాటక అంతటా పాజిటివ్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ దుమ్ము రేపుతోంది. ఈ సూపర్ సక్సస్స్ తో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన పి. వాసు కన్ను రజనీకాంత్ నాగార్జునుల పై పడింది అని అంటున్నారు. ఈ సినిమాను ఓ భారీ నిర్మాత చేత తమిళ తెలుగు భాషలలో ఒకేసారి రజనీకాంత్ నాగార్జునలతో తీయడానికి వాసు అప్పుడే పధకాలు రచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

గతంలో పి. వాసు దర్శకత్వంలో వచ్చిన ‘చంద్రముఖి’ ఒక హర్రర్ ధ్రిల్లర్ మూవీగా సంచననాలు సృస్టించిన నేపధ్యంలో తిరిగి అదే ప్రయోగానికి ఈ దర్శకుడు శ్రీకారం చుడుతున్నాడు అని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కన్నడ  సినిమా ‘శివలింగ’ లో సాధు కోకిల కామెడీ ట్రాక్ బాగా పండిన నేపధ్యసంలో ఈ పాత్రను  తెలుగు తమిళ భాషలలో బ్రహ్మానందం చేత చేయిద్దాం అనే ఆలోచనలు వాసుకు ఉన్నట్లు టాక్. 

అయితే ఈ సినిమాలో నటించడానికి  నాగార్జున ఒప్పుకున్నా అంత సులువుగా రజనీకాంత్ ఒప్పుకుంటాడ అన్నది ప్రశ్న. ప్రస్తుతం దెయ్యం సినిమాలను ప్రేక్షలులు బాగ ఆదరిస్తున్న నేపధ్యంలో దర్శకుడు వాసు మాస్టర్ ప్లాన్ కు రజనీ, నాగ్ లు ఎంత వరకు సహకరిస్తారో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: