అడల్ట్ కామెడీ షో జబర్దస్త్ లో మెయిన్ హైలైట్ గా నిలిచే యాంకర్ రేష్మీ ఈ మధ్య భారీ గా సినిమాల వైపు అడుగులు వేస్తోంది. గుంటూర్ టాకీస్ సినిమా ట్రైలర్ , సాంగ్ ప్రోమో లతోనే పిచ్చెక్కిస్తున్న రశ్మి ఇప్పుడు కొత్తగా ' తను వచ్చేనంట' అనే సినిమా లో నటిస్తోంది. ఈ సినిమా తెలుగు సినిమా లో మొట్ట మొదటి ' జాంబీ ' చిత్రంగా చెబుతున్నారు. జాంబీ అంటే ఒక రకంగా దయ్యం లాంటి మనిషి అన్నమాట. నిత్యం జబర్దస్త్ తో నవ్వించే రేష్మీ ఇప్పుడు భయపెట్టడం తన లక్ష్యంగా పెట్టుకోవడం విశేషమే.

 

 

 

 

ఈ సినిమా కి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయిన తరవాత టైటిల్ ప్రకటించి ఫస్ట్ లుక్  విడుదల చేసారు.తేజ కాకుమాను - రష్మీ గౌతమ్ - ధన్య బాలకృష్ణలతోపాటు చలాకీ చంటి కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. పూర్తి హర్రర్ కాదు అనీ కామెడీ హర్రర్ అనీ సినిమా నిర్మాతలు చెబుతున్నారు. జాంబీ పాత్ర లో నటిస్తూనే మరొక పక్క మాంచి మసాలా పాత్రలో కూడా కనపడబోతోంది రశ్మి. అటు అందాల ఆరబోత తో మాత్రమే సరిపెట్ట కుండా ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లు చెయ్యడం వలన నాలుగు కాలాల పాటు ఇండస్ట్రీ లో ఉండి నాలుగు రాళ్ళు సంపాదించుకునే అవకాశం కచ్చితంగా ఉంటుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: