మోహన్ బాబు.. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ స్పెషల్ పేజీ కేటాయించుకున్న నటుడు. అటు నటన పరంగా చూసినా.. ఇటు చిత్ర నిర్మాణపరంగా చూసినా ఆయన అనేక ప్రయోగాలు చేశారు. హీరోగా, విలన్ గా, కామెడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఇలా ఇన్ని వెరైటీలు చేసిన నటుడుగా మోహన్ బాబు ప్రత్యేకత ఉంది. 

లైఫ్ స్టైల్ పరంగా కూడా మోహన్ బాబు వెరైటీనే. ఆయన మోనార్క్ లాంటి వాడు. అంత సులభంగా ఎవరి మాటా వినడు. ముక్కుసూటి మనిషిగా పేరు. ఇగోయిస్టు కూడా అన్న వాదన ఉంది. ఆ కారణంగానే మోహన్ బాబుకు, చిరంజీవికీ గొడవలు అయ్యాయని చెబుతారు. అలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న మోహన్ బాబుకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటపడింది. 

సినీ ఇండస్ట్రీలో ఎవరి మాటా వినడు అని పేరున్న మోహన్ బాబు మాత్రం ఒకరంటే భయపడతరాట. ఈ విషయం స్వయంగా ఆయనే బయటపెట్టారు. ఇంతకీ మోహన్ బాబు భయపడేది ఎవరికో తెలుసా.. నందమూరి బాలకృష్ణకు. అవును. మొన్న అనంతపురం జిల్లాలో జరిగిన లేపాక్షి ఉత్సవాల్లో ఈ విషయం స్వయంగా బాలకృష్ణే చెప్పారు. 

మోహన్ బాబు ఎవరికి భయపడినా పడకపోయినా.. ఒకరంటే భయపడతారు.. ఆయనే నం.. అంటూ ఆగిపోయారు.. అన్నయ్యా చెప్పనా.. అంటూ మోహన్ బాబు వైపు చూశారు. మోహన్ బాబు విలాసంగా నవ్వుతూ చెప్పమన్నట్టుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయినా సరే ఎందుకో బాలయ్య సమాధానం పూర్తి చేయకుండానే ఆగిపోయారు. 

ఆ తర్వాత అదే వేదికపై నమాట్లాడిన మోహన్ బాబు.. బాలయ్యను ఆకాశానికి ఎత్తేశారు. బాలయ్యా.. నిన్ను చూస్తే మా అన్న ఎన్టీఆర్ ను చూసినట్టు ఉంటుందయ్యా.. అందుకే భయపడతా.. అది భయం కాదు.. భక్తి.. అంటూ ముగించారు. అదండీ సంగతి. 



మరింత సమాచారం తెలుసుకోండి: