మంచు మనోజ్ దశరథ్ కాంబినేషన్ గత శుక్రవారం విడుదల అయిన ‘శౌర్య’  మొదటిరోజు మొదటి షో నుండి ఘోర మైన ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం మంచు ఫ్యామిలి జీర్ణించు కోలేని వార్త గా మారింది అని టాక్. మనోజ్ ఈసినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకోవడమే కాకుండా ఈసినిమా గురించి తన లుక్ ను కూడ మార్చుకుని ఏదో విధంగా హిట్ కొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసాడు. 

ఈ సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ తో షాక్ లో ఉన్న మనోజ్ కు అమెరికాలో ఈ సినిమా గురించి జరిగిన సంఘటన  పెద్ద అవమానoగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. మంచు మనోజ్ కెరియర్ లో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక థియేటర్స్ లలో సుమారు 1000 ధియేటర్లలో ఈచిత్రాన్ని రిలీజ్ చేసారు.

అదేవిధంగా ఈసినిమాను ఓవర్సీస్ లో కూడ చాలా ప్రాంతాలలో విడుదలచేసారు. అయితే యుఎస్ లోని క్యాలిఫోనియాలోని ఒక  ధియేటర్ లో ‘శౌర్య’ షోకి ఒకే ఒక టికెట్ అమ్ముడుపోవడం షాకింగ్ న్యూస్ గా మారింది. దీనితో ఈ న్యూస్ మనోజ్ కు షాకింగ్ న్యూస్ గా మారింది అని టాక్.  

ఇంతటి ఘోరమైన అవమానం ఓవర్సీస్ లో మన టాలీవుడ్ కి సంబంధించి ఏ హీరోకి జరగలేదని ఫిలింనగర్ టాక్. ఈవిషయం మనోజ్ వరకు వెళ్ళడంతో ఈ మంచు వారి అబ్బాయి తీవ్ర మనోవేదనలో  ఉన్నాడని  ఫిలింనగర్  గాసిప్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: