వివిడ్ జర్నీ బ్యానర్ పై శ్రీ రాం కొడాలి, అమితారావ్ నాయకా నాయికలు గా వాచెస్పతి దర్సకత్వం వహిస్తున్న చిత్రం "కెమిస్ట్రీ-మనసుకీ మనసుకీ మధ్య" . దర్శకులు మాట్లాడుతూ ‘ఈ సినిమా క్లీన్ అండ్ ఫమిల్య్ ఎంటర్ టైనర్ సినిమా ప్రియులు అంటే 50 రూపాయలు ఉండి ఆకలి వేస్తుంటే తినడం కన్నా సినిమా చూడటానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు . అలా చూసిన వాళ్ళకి సినిమా బాలేకపోతే ఎవడురా డైరెక్టర్ అని తిట్టుకుంటారు . నేను అలా తిట్టుకున్నా సందర్బాలు చాలా ఉన్నాయి . మా సినిమా చూసాక మీరు ఒక చెత్త సినిమా చూశాము అని మీకు అనిపిస్తే మాకు కాల్ చేసి చెప్పచు . సినిమా రిలీజ్ ఐన మొదటి వారం ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ మీద మీరు కాల్ చేసి మాట్లాడచ్చు . అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను’ అని తెలిపారు. ప్రొడ్యూసర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ‘‘పరిచయం నుంచి పరిణయం దాక ఒక జంట మధ్య జరిగిన చిలిపి సన్నివేశాలు సరదాలు చిన్న చిన్న తగువులు అద్భుతంగా పండాయి.చూస్తున్న ప్రేక్షకులు తెర పై జరుగుతున్న కథలో తమను తాము ఊహించుకునే విధంగా చిత్రాన్ని తీర్చి దిద్దటం జరిగింది. యువకుల నుండి మధ్య వయస్కుల దాకా అందరూ తమ జీవితం లో తమ భాగస్వామి తో జరిగిన సందర్భాలను ఒక్క సారి గుర్తు తెచ్చుకుంటారు. అంతా కొత్త వాళ్ళతో చేసిన మా కెమిస్ట్రీ సినిమా షూటింగు విజయవంతంగా పూర్తిచేసుకున్నాము ప్రస్తుతం రీ-రికార్డ్నింగ్ జరుగుతుంది .త్వరలోనే ఆడియో ని సినిమా ని విడుదల చేస్తాం." అన్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫి - చక్రధర్, ఎడిటింగ్ - నికోలస్, సాహిత్యం - కిట్టు విస్సాప్రగడ, సంగీతం - విశ్వనాధ్ ఘంటసాల, నిర్మాణం - ఉదయ్ కుమార్ , కో - ప్రొడ్యూసర్ - జి .శ్రీనివాస్ , కథ,స్క్రీన్ ప్లే , మాటలు, దర్శకత్వం - వాచెస్పతి జొన్నలగడ్డ.

మరింత సమాచారం తెలుసుకోండి: