బాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్, కామెడీ పాత్రలతో అలరించిన శక్తి కపూర్ అంటే తెలియన వారు ఉండరు. ఆయన కూతురు శ్రద్దాకపూర్ ‘ఆశిఖీ -2’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా అయినా కూడా ఈ అమ్మడు తన పర్ఫామెన్స్ తో అందరి మనసు దోచేసింది..వాస్తవానికి సినిమా నేపథ్యం నుంచి వచ్చినందువల్లే అంత ఈజీగా నటించిందని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం శ్రద్దా కపూర్ ‘బాగీ’ చిత్రంలో టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తుంది. ఇందులో విలన్ గా తెలుగు హీరో సుదీర్ బాబు నటించడం విశేషం.

తాజాగా బాలీవుడ్ లో తనపై వస్తున్న వార్తలు ఖండించింది శ్రద్ద.  ఈ భామ సంజయ్‌దత్ తో కలిసి నటిస్తున్నట్టు వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న నేరారోపణపై పదమూడు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి వచ్చిన సంజయ్ దత్త్ ప్రస్తుతం సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో శ్రద్దాకపూర్ హీరోయిన్ గా నటిస్తున్న వార్తలు ప్రచారంలోకి రావడంతో ఈ అమ్మడు వెంటనే స్పందించింది. సంజయ్ దత్త్ తాను సినిమాలో నటిస్తున్నట్టు వచ్చిన వార్తలు నిజం కావు.

సంజయ్ దత్త్, శ్రద్దా కపూర్



దత్త్ అంటే తనుకు చాలా గౌరవం అని ఒకవేళ నిజంగా హీరోయిన్ గా చాన్స్ వస్తే మాత్రం తప్పకుండా చేస్తానని చెప్పింది. శ్రద్దాకపూర్-టైగర్‌ష్రాప్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘భాఘీ రెబల్ ఇన్ లవ్’ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: