రేపు విడుదల అవుతున్న శర్వానంద్ మూవీ ‘రాజాధిరాజ’ ప్రమోషన్ లో ఆ సినిమా పై  క్రేజ్ పెంచడానికి ఆ సినిమా దర్శకుడు చేరన్ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. వరుస హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న శర్వానంద్ క్రేజ్ ను ఉపయోగించుకోవడానికి  తమిళంలో గత ఏడాది రిలీజ్ అయిన శర్వానంద్ నటించిన ఫెయిల్యూర్ మూవీని ‘రాజాధిరాజ’ పేరుతో డబ్ చేసి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

కోలీవుడ్ లో ఈసినిమా గత సంవత్సరం విడుదలైన రోజునే ఈసినిమాకు సంబంధించిన డీవీడీలు కూడా అమ్మేసిన చరిత్ర ఈ సినిమాకు ఉంది. అయితే అనుకోకుండా పెరిగి పోయిన శర్వానంద్ ఫామ్ ను క్యాష్ చేసుకునేందుకే ఈ సినిమాను డబ్బింగ్ చేశారనే టాక్ ఉంది. ‘రన్ రాజా రన్’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ఇలా రాజ టైటిల్స్ అన్నీ శర్వానంద్ కు కలిసి వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు ఈసినిమాకు ‘రాజాధిరాజా’ అనే టైటిల్ పెట్టారు.

అయితే ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఈసినిమా దర్శకుడు చేరన్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన విషయాలు బయట పెడుతూ ఈ సినిమా క్రేజ్ ను పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆశ్చర్యకరమైన ఈ కామెంట్స్ వివరాలలోకి వెళ్తే ఈ దర్శకుడు గతంలో తీసిన ‘ఆటోగ్రాఫ్’ అనే మూవీ టాలీవుడ్ లో రీమేక్ అయింది. 

అప్పట్లో తనను పవన్ కళ్యాణ్ ఇంటికి పిలిచి మాట్లాడారని తన ‘ఆటో గ్రాఫ్’ ని రీమేక్ చేద్దామని చెప్పారని అంటున్నాడు చేరన్. అయితే అంతలోనే మలయాళ ఆటోగ్రాఫ్ నిర్మాతలు ఈ మూవీని వేరేవాళ్లకి అమ్మేయడంతో పవన్ తో సినిమా చేసే అవకాశం మిస్ అయిపోయిందని చెపుతున్నాడు ఈ దర్శకుడు. అయితే ఎప్పుడో విడుదలైన ‘ఆటోగ్రాఫ్’ సినిమా సంగతులు చేరన్ ఇప్పుడు గుర్తుకు చేసుకుని అందరికీ తెలిసేలా ఎందుకు లీక్స్ ఇస్తున్నాడో చాలామందికి అర్ధం కాని ప్రశ్నగా మారింది. ఎదోవిధగా పవన్ నామస్మరణ జరిగితే ఆ సినిమాకు క్రేజ్ పెరుగుతుంది అన్న ఉద్దేశ్యంతో దర్శకుడు చేరన్ ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: