దశాబ్ధ కాలం నుండి ఉంటున్న హీరోయిన్ ఇప్పుడు సరికొత్త జోష్ ను కనబరుస్తున్నారు.. ప్రస్తుతం చేస్తున్న సినిమాల కాన్ఫిడేంట్ వారిని అలా ఉంచేలా చేస్తున్నాయంతే. అదీగాక చేస్తున్న సినిమాలు కూడా ప్రేక్షకుల దగ్గర మంచి ఆదరణ లభిస్తున్నాయి. అయితే అదే జోరుతో చేసే సినిమాల పట్ల మరింత కాన్సంట్రేట్ చేస్తూ సినిమాకు కావాల్సిన అన్ని విభాగాల్లో తమ సహాయం అందిస్తున్నారు. ప్రస్తుతం నాయకి కోసం త్రిష అలానే చేస్తుంది.   


చీకటి రాజ్యం సినిమాలో కెరియర్లో 50 సినిమాల మైలు రాయిని పూర్తి చేసుకున్న త్రిష తన సినిమాల జోరుని పెంచింది. అదీగాక చేస్తున్న సినిమాలు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చేలా చూసుకుంటుంది. కళావతి అంటూ అలరించిన త్రిష నాయకి గా వచ్చేందుకు సిద్ధమైంది. తెలుగు తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమాలో త్రిష రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుంది. 


గోవర్ధన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను గిరిధర్‌ మామిడిపల్లి, రాజ్‌ కందుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంతేకాదు త్రిష ఈ సినిమా కోసం ఓ పాట కూడా పాడటం జరిగింది. అయితే ఇప్పుడు ఆ సాంగ్ మేకింగ్ వీడితోతో హడావిడి చేస్తున్నారు నాయకి టీం. రఘు కుంచె సంగీత సారథ్యంలో వస్తున్న ఈ నాయకిలో త్రిష తన గొంతుని సవరించుకుంది.


ఆ వీడియో కూడా చాలా సరదాగా ఉంది. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా త్రిష కెరియర్ కు మంచి బూస్టప్ ఇస్తుందని నమ్ముతుంది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని చూస్తున్న నాయకి దర్శక నిర్మాతలు సరైన రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: