తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన చిత్రం ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ గురించే టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఒక వైపు సినిమా మాస్ యాక్షన్ అద్భుతంగా ఉందని సినిమా సూపర్ హిట్ అంటుంటే మరోవైపు అబ్బే సినిమా మొత్తం పవన్ కళ్యాన్ చూపించారు..అంతే తప్ప ఏమీలేదు అంటున్నారు. ఏది ఏమైనా ఈ చిత్రం విడుదలై అన్ని సెంటర్లలో మొదటి రెండు రోజులు మాత్రం కలెక్షన్ల పరంగా దూసుకు పోయింది..ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాన్ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ‘ఖుషి’ సీక్వెల్ తీయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

శ్రీమంతుడు పోస్టర్


ఈ నేపథ్యంలో తెలుగు లో సూప్ స్టార్ మహేష్ బాబు తో శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ మూవీ తీసిన మైత్రి మూవీస్ సంస్థ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో  జనతా గ్యారేజ్ చిత్రం నిర్మిస్తుంది. అయితే ఇలాంటి సంస్థలో చిత్రం తీయడమంటే అదృష్టంగా భావించాలి..కానీ పవన్ కళ్యాన్ మాత్రం ఈ సంస్థ నిర్మాతలకు భలే షాక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చేస్తూ తమ తర్వాతి సినిమాని పవన్ కళ్యాణ్ తో చేయనున్నట్లు కూడా ప్రకటించింది.

జనతా గ్యారేజ్ ముహూర్తం లో ఎన్టీఆర్, కొరటాల శివ


అయితే పవన్ కళ్యాన్ మాత్రం ఈ సంస్థ నిర్మాతలకు పెద్గ షాక్ ఇచ్చాడు..తాను ఈ సంస్థలో చిత్రం తీయడం లేదని దీనికోసం తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాణ రంగంలోకి వచ్చి మొదటి చిత్రంతో సూపర్ డూపర్ హిట్ సాధించిన సంస్థకు పవన్ ఇలా షాక్ ఇవ్వడంపై టాలీవుడ్ వర్గాల్లో ఆశ్చర్యం వేసింది.  మొదటి సినిమానే మహేష్ తో చేసిన మైత్రి మూవీస్ రెండో సినిమాని ఎన్టీఆర్ తో సెట్ చేసి సంచలనం సృష్టించింది కానీ పవన్ తో చేయాలనుకున్న సినిమా చేజారి పోవడంతో షాక్ అయ్యారు సదరు నిర్మాతలు . 


మరింత సమాచారం తెలుసుకోండి: