తెలుగు చలన చిత్రసీమలో పవన్ కళ్యాన్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు..వచ్చిన కొత్తలో పెద్దగా సక్సెస్ ఫుల్ హీరో అనిపించకున్నా ఖుషి,తమ్మడు,జల్సా,గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సంపాదించాడు..అంతే కాదు తనదైన మ్యానరీజంతో మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాన్ అంటే ట్రెండ్ ఫాలో అయ్యేవాడు కాదు..ట్రెండ్ సెట్ చేసేవాడు అన్న స్థాయికి వచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పవనీజం మారుమోగుతుంది. పవన్ కళ్యాన్ ఒక్క నటుడిగానే కాకుండా ఓ రాజకీయ వేత్తగా ప్రజల్లోకి దూసుకు వెళ్లాడు.

సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రం


జనసేన అనే పార్టీ స్థాపించి తెలుగు ప్రజలకు మరింత చేరువ అయ్యాడు. ఇక పవన్ కళ్యాన్ తెరపై రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రం ఉగాది పండుగ రోజు రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రం అనుకున్న అంచనాలకు చేరుకోలేక పోయింది.. కాకపోతే కలెక్షన్ల పరంగా నాట్ బ్యాడ్ అనిపించుకుంటుంది. దీంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్  కి మరోసారి కనువిందు చేయాలని చూస్తున్నారు. పవన్ కెరీర్ లో మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘ఖుషి’ .  ఈ చిత్రానికి ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించారు..భూమిక హీరోయిన్ గా నటించింది.    

ఖుషి చిత్రంలో భూమిక, పవన్ కళ్యాన్


పవర్ స్టార్ తనకు ఖుషీలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబందించి చర్చలు ఇప్పటికే పూర్తవ్వడంతో త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఖుషీకి సీక్వెల్‌గా ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఓ ప్రేమకథగా సినిమా ఉండనుంది. ఈ మూవీకి హుషారు అనే పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతా ఓకే అయితే ఈ నెల 29న ఈ సినిమాను లాంచ్ చేయాలని పవన్ భావిస్తున్నారట. ఇక ఈ చిత్రం పవన్ ఆప్త మిత్రుడు శరత్ మరార్ నిర్మించనున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: