తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయిన ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత దర్శకుడిగా ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో సూపర్ హిట్ సినిమా తీశారు..అప్పటి నుంచి ఆయన మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. సాధారణంగా దర్శకులు అనగానే జయాపజయాలు అనేవి సాధ్యం..కానీ రాజమౌళికి మాత్రం అపజయమన్నది లేకుండా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు ఆయన తీసిన చిత్రాలు అన్నీ అద్భుత విజయం సాధించినవే. గత సంవత్సరం విడుదలైన ‘బాహుబలి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాడి సత్తా ఏమిటో నిరూపించింది.

రాజన్న చిత్రంలో నాగార్జున


తెలుగు,తమిళ,హిందీ ఇండస్ట్రీలో రికార్డుల మోత మోగించింది. ఈ చిత్రంతో ఒక్క రాజమౌళి మాత్రమే కాదు ప్రభాస్,రానా, రమ్యకృష్ణ,సత్యరాజ్,తమన్నా,అనుష్క లాంటి నటులు పేర్లు బాలీవుడ్, కోలీవుడ్ లో మారుమోగాయి. అంతే కాదు ఈ చిత్రం 600 కోట్లకు పైగా వసూళు చేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న బాహుబలి 2 కూడా అదే స్థాయి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంత పాపులర్ అయిన రాజమౌళి బాహుబలి 2 తర్వాత ఏ సినిమా తీయబోతున్నారా అని క్యూరియాసిటతో ఉన్నారు. అయితే రాజమౌళి తర్వాతో ఓ సినిమా తీయబోతున్నారు..కానీ అది ఆయన కాదు..రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.


గతంలో విజయేంద్ర ప్రసాద్, నాగార్జున కాంబినేషన్లో రాజన్న ఒక దేశభక్తుడు చిత్రం తీశారు. అయితే అది కమర్షియల్ గా విజయం సాధించలేక పోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సన్నీడియోల్ తో మేరా భారత్ మహాన్ పేరుతో తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి రాజమౌళి క్రియేటీవ్ డైరెక్టర్ గా వ్యవరించబోతున్నాడు. గతంలో రాజన్న చిత్రానికి కూడా  కొన్ని సీన్స్ డైరెక్ట్ చేసిన జక్కన్న ఇప్పుడు మేరా భారత్ మహాన్ సినిమా కోసం మరోసారి తండ్రికి సాయం చేయడానికి రెడీ అవుతున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: