నిఖిల్, స్వాతి జంటగా ’స్వామి రారా’ అనే చిత్రం తెరకెక్కనుంది. సుధీర్ వర్మ దర్శకుడు. చక్రి చిగురుపాటి నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ సోమవారం హైదరాబాద్లో మొదలైంది. నిర్మాత మాట్లాడుతూ ‘‘ మా తొలి ప్రయత్నం నిఖిల్ తో ‘వీడు తేడా’ చేశాం. ఇప్పుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఎక్కడా రాజీ పడకుండా చేస్తాం. కేరళ, తమిళనాడులో చిత్రీకరిస్తాం’’ అని అన్నారు. కెమెరా - రిచర్డ్ ప్రసాద్, సంగీతం - సన్ని, ఎడిటింగ్ - ఎస్.ఆర్.శేఖర్, పాటలు - కృష్ణ చైతన్య, సహ నిర్మాత - కొరటాల సందీప్.

మరింత సమాచారం తెలుసుకోండి: