తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చిత్ర రంగానికి చెందిన వారే వారుసులుగా వస్తున్న తరుణంలో మొదటి సారి రాజకీయ రంగానికి చెందిన ఏపీ సీఎం నారా చంద్రబాబు ఫ్యామిలీ నుంచి హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు నారా రోహిత్. మంచి పర్సనాలిటీ..చూడగానే ఆకర్షించే రూపు రేఖలతో హీరోగా బాగానే సెట్ అయ్యాడు. నారా రోహిత్ నటించిన సినిమాలు బిగ్గెస్ట్ హిట్ కాకపోయినా..కొన్ని సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సంవత్సరం విడుదలైన ‘తుంటరి’, ‘సావిత్రి’ సినిమాలతో బాగానే అలరించాడు నారా రోహిత్. ఈ నెల 29 న  ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

 ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమా పోస్టర్


సినిమా చాలా రిచ్ గా తెరకెక్కించినట్లు కనిపిస్తుంది..అందే కాదు మరో ట్విస్ట్ ఏంటంటే నందమూరి తారకరత్న ఫస్ట్ టైమ ఇందులో విలన్ గా నటించబోతున్నాడున. వాస్తవానికి ఇప్పటి వరకు నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి వారు విలన్ గా ఎప్పుడూ చేయలేదు..మొదటి సారిగా తారకరత్న విలన్ గా వస్తున్నాడు. అంతే కాదు ఇప్పటి వరకు కనిపించని కొత్త లుక్ లో చాలా రాయల్ గా కనిపిస్తున్నాడు. వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వారాహిచలనచిత్రం బ్యానర్‌పై సాయిశివాని సమర్పణలో ఈ చిత్రం రూపొందింది.

రాజా చెయ్యి వేస్తే ఆడియో వేడుక


ప్రదీప్ చిలుకూరి ద‌ర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇషా తల్వార్ హీరోయిన్‌గా నటించింది. ఈ మద్యే రీసెంట్‌గా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం  సాయంత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ఇచ్చాడు. అలాగే సెన్సార్ నుంచి ఈ చిత్రానికి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని సమాచారం. మొత్తానికి నారా వారి అబ్బాయి ఈ సంవత్సరం మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. చిత్ర యూనిట్ అంచనాలకు తగ్గట్టే మంచి విజయం సాధిస్తుందా? లేదా? వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: