మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ సినిమా మరి కొద్ది గంటలలో ప్రారంభం కాబోతోంది. మెగా అభిమానులకు మీడియాకు హాట్ టాపిక్ గా మారిన ఈ సినిమా ప్రారంభోత్సవావికి అటు మీడియాను ఇటు మెగా అభిమానులను చాల దూరంగా పెడుతున్నారు. ఇప్పటికే మెగా అభిమానులకు ఈ ప్రారంభోత్సవం జరిగే ప్రదేశానికి వచ్చి తమని అసౌకర్యానికి గురిచేయవద్దు అంటూ మెగా అభిమానులకు మెగా కాంపౌండ్ సంకేతాలు పంపినట్లు టాక్.

ఈ వార్తలు ఇలా ఉండగా రామ్ చరణ్ ‘కొణిదల ప్రొడక్షన్ కంపెనీ’ పేరిట నిర్మిస్తున్న నేపధ్యంలో ఈ ప్రొడక్షన్ హౌస్ లోగోను డిజైన్ చేసి మీడియాకు తెలిసే విధంగా లీకులు ఇస్తోంది మెగా కాంపౌండ్. మెగా స్టార్ చిరంజీవికి అత్యంత ఇష్టమైన దేవుడు ఆంజనీయ స్వామి లోగోతో  సింధూరం రంగు బ్యాక్ గ్రౌండ్ తో ఈ లోగును డిజైన్ చేసారు. 

ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ నిర్మాతగా మారడమే కాకుండా ఈ ప్రొడక్షన్ హౌస్ పేరిట భవిష్యత్ లో చాల సినిమాలు నిర్మించే ఉద్దేశ్యంలో రామ్ చరణ్ ఉన్నట్లు టాక్. భారీ బడ్జెట్ సినిమాలలో భారీ పారితోషికాలు తీసుకునే టాప్ హీరోలు తమ సొంత బ్యానర్ పై చిన్న సినిమాలను నిర్మిచే ట్రెండ్ శ్రీకారం చుట్టిన నేపధ్యంలో చరణ్ కూడ తన ‘కోనేదల ప్రొడక్షన్ కంపెనీ’ పై భవిష్యత్ లో చిన్న సినిమాలు చాల నిర్మిoచే ఆలోచనలో  ఉన్నాడని తెలుస్తోంది.

ఇక చిరంజీవి 150 వ సినిమాకు అన్నీ తానై వ్యవహరిస్తున్న రామ్ చరణ్ ఈసినిమాను బడ్జెట్ పరంగా కాని ప్రమోషన్ పరంగా కాని ఎక్కడా రాజీ పడకుండా తిరిగి తన తండ్రి చిరంజీవిని మెగా స్టార్ సింహాసనం పై కూర్చో పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలకు మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: