ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ క్రేజీ ఉన్నప్పటికీ, వరుస ప్లాపులను చూస్తున్న దర్శకుడు ఎవరు అంటే అది కచ్ఛితంగా పూరీ జగన్నాధే అని అంటున్నారు. ఎందుకంటే గత కొంత కాలంగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రాలు అన్నీ వరుసగా ప్లాపులను చూస్తున్నాయి. ఎన్టీఆర్ తో వచ్చిన టెంపర్ మూవీ సైతం  కథా పరంగా బాగున్నప్పటికీ...బిజినెస్ పరంగా కొన్ని చోట్ల నష్టాల్ని చూడాల్సివచ్చింది.


పెద్ద పెద్ద హీరోలు అంతా పూరీ జగన్నాధ్ కోసం ఎదురుచూసిన సందర్భాల్లో, తను చిన్న హీరోలవైపు వెళ్ళటం..సొంతంగా నిర్మాణ భాగస్వామ్య వ్యవహారాల్లో వేలు పెట్టడం వంటివి చేశాడు. దీని కారణంగా పూరీకి టాలీవుడ్ లో కొంత మార్కెట్ పడిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాహుబలి మూవీ తరువాత సినిమాల సక్సెస్ రేటు కొంత పెరుగుతూ వస్తుంది.


ఈ సక్సెస్ రేటు ని చూసిన వారిలో టాలీవుడ్ కి చెందిన యంగ్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ ఎందరో ఉన్నారు. కానీ పూరీ కి మాత్రం ఈ సక్సెస్ రేటులో స్థానం దక్కకపోవటం విశేషం. ఇటువంటి పరిస్థితుల్లో పూరీ జగన్నాథ్ కచ్ఛితంగా పెద్దహీరోలతో సక్సెస్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కళ్యాణ్ రామ్ తో పూరీ కాంబినేషన్ ఉన్నప్పటికీ...పూరీ కి ఇంకా పెద్ద హీరోలతో మూవీలను చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది.


అందుకే పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. పెద్ద హీరోలతో హిట్స్ ని కొట్టేందుకు పూరీ సైతం రెడీ అవుతున్నారు. గతంలో చిన్న మూవీలతో వచ్చిన ప్లాపుల కారణంగా పూరీ కిందకి దిగొచ్చి, తిరిగి పెద్ద హీరోలతో జోడీ కట్టేందుకు రెడీ అవుతున్నాడని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: