మెగా హీరో వరుణ్ తేజ్ శ్రీనువైట్లతో చేస్తున్న సినిమా బ్రేక్ పడ్డదని తెలిసిన సంగతే కదా.. అయితే సినిమా యూనిట్ మాత్రం విసా ప్రాబ్లం వల్ల బ్రేక్ వచ్చిందంటూ చెప్పుకొస్తుంటే తాజాగా సినిమా ఆగిపోయింది విసా ప్రాబ్లం వల్ల కాదు హీరో వరుణ్ తేజ్ వల్ల అంటూ రూమర్లు వస్తున్నాయి. అదేంటి వరుణ్ తేజ్ వల్ల సినిమా ఎందుకు ఆగిపోయింది అంటే వివరాలు ఇలా ఉన్నాయి.


లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ :


లోఫర్ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ ఇంకా ఓ సినిమాను పూర్తి చేయకపోవడం విశేషం. అయితే మధ్యలో ఓ రెండు సినిమాలు అనుకోవడం అవి కాస్త అటకెక్కడం లాంటివి జరిగాయి.. ఇక ఫైనల్ గా శ్రీనువైట్లతో కమిట్ అయిన వరుణ్ తేజ్ ఇప్పుడు ఆ సినిమాను కూడా షూటింగ్ కు అంతరాయం కలిగించేస్తున్నాడట. ప్రస్తుతం చిత్ర యూనిట్ కు విసా రాలేదు కాబట్టి షూటింగ్ కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చామని చెప్పుకుంటున్న యూనిట్ అసలు కారణం నిర్మాతల దగ్గర వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడమే అంటూ వార్తలు వస్తున్నాయి.


కేవలం మూడు సినిమాల అనుభవం ఉన్న ఈ హీరో ప్రస్తుతం పారితోషికం కన్నా ముందు సినిమా హిట్ చేసుకుని ఓ ఇమేజ్ సంపాదించుకుంటే మంచిది. ఓ పక్క ఇంచు మించు తనతో పాటుగా వచ్చిన మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ఎలాగోలా సుప్రీం హీరో అనే స్క్రీన్ నేమ్ కూడా దక్కించుకున్నాడు. మరి ఈ పరిస్థితుల్లో వరుణ్ తేజ్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆయనే ఆలోచించాలి.   


శ్రీనువైట్ల, వరుణ్ తేజ్ సినిమా ఓపెనింగ్ : 


అయితే కొంతమంది మాత్రం సినిమా ఆగింది కేవలం విసా వల్లనే తప్ప వరుణ్ తేజ్ వల్ల కాదంటూ బల్ల గుద్ది చెబుతున్నారు. మరి సినిమా స్టార్ట్ అయితే గాని ఈ రూమర్లకు చెక్ పడేలా లేదు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నల్లమలపు శ్రీనివాస్ బుజ్జి నిర్మిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: