తెలుగు ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు తీసి ఎక్కువ పాపులారిటీ సంపాదించిన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ప్రొఫెషనల్ గా లెక్కల మాస్టరైన సుకుమార్ దర్శకత్వంపై మోజుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మాస్ సినిమాల టైంలో కొత్త తరహా చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు సుకుమార్. ఆ మద్య మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే చిత్రం తీశారు. కానీ ఆ సినిమా ఆశినంత స్థాయిలో విజయం సాధించలేక పోయినా సినిమా మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందని టాక్ వచ్చింది. ఈ సంవత్సరం జూ.ఎన్టీఆర్ తో తీసిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది.

అంతే కాదు ఎన్టీఆర్ కెరీర్ లో 50 కోట్ల క్లబ్ లో చేరి చిత్రంగా నిలిచిపోయింది. ఇక దర్శకత్వమే కాదు నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన  సుకుమార్ రైటింగ్స్ పేరుతో బ్యానర్ను స్థాపించి తొలి ప్రయత్నంగా కుమారి 21ఎఫ్ సినిమాను తెరకెక్కించాడు. సుకుమార్ నిర్మాతగా తన రెండో సినిమా కోసం మరో బ్యానర్ను స్థాపిస్తున్నాడు. తన తండ్రి పేరుతో బండ్రెడ్డి తిరుపతినాయుడు పేరిట నెలకొల్పిన బీటీఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై దీనిని నిర్మిస్తామని చెప్పాడు.తన అన్న కొడుకు అశోక్ను హీరోగా పరిచయం చేయబోతున్నాడు.

ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయిన ఈ సినిమాకు దర్శకుడు అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన హరిప్రసాద్, ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. దీనికి ట్యాగ్ లైన్‌గా ‘ఫర్ లవ్ హిజ్ ఫ్యాషన్’ ఉంటుందన్నారు.  ‘అంతకు ముందు ఆ తర్వాత..’ సినిమాలోని హీరోయిన్ ఈష ఈ సినిమాలో కథానాయకిగా నటిస్తుందన్నారు.  ఈ నెల 9 నుంచి షూటింగ్ జరుగుతుందని ఆయన చెప్పాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: