తెలుగు,తమిళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకువెళ్తున్న కలువ కళ్ల భామ కాజల్ ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఈ అమ్మడు అంధురాలిగా నటిస్తుంది..అంతే కాదు గత కొన్ని రోజులుగా ఈ చిత్రంపై రక రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి. స్వతహాగా లిప్ లాక్ సీన్లకు దూరంగా ఉండే కాజల్ ని ఈ చిత్రంలో హీరో రణదీప్ హుడా అనుకోకుండా కిస్ చేశాడని తర్వాత ఈ ఘటనపై క్షమాపణలు కోరాడని అప్పట్లో చెప్పింది..తర్వాత ప్లేట్ మార్చి అబ్బే ఆ సిన్ చిత్రంలో లిప్ లాక్ సీన్ ఒక భాగమని చెప్పేసింది. మొత్తాని లిప్ లాక్ సీన్ గురించి పెద్ద హంగామా చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.

తాజాగా ఇప్పుడు ‘దో లఫ్జోం కీ కహానీ’ చిత్రంలో హీరో రణదీప్ హుడా, హీరోయిన్ కాజల్ అగర్వాల్ మధ్య 18 సెకండ్లపాటు ఉన్న ముద్దు సన్నివేశంపై సెన్సా రోళ్ళు కస్సుమన్నారట. ఈ సీన్ ని సగానికి అంటే 9 సెకండ్లకు కుదించింది. ఈ మధ్య సెన్సార్ సర్టిఫికెట్స్ విషయంలో కొంచెం సీరియస్ గా వ్యవహరిస్తుందని మరోసారి నిరూపించింది. ఆ మద్య సన్నీలియోన్ మస్తిజాదే చిత్రం చూసి సెన్సార్ బోర్డ్ ఖంగు తిన్నారు..చాలా వరకు సీన్లు కట్ చేసి చివరికి సినిమా విడుదల చేయించారు.

అంతే కాదు బాలీవుడ్ మూవీ ఉడ్తా పంజాబ్ మేకర్స్ కు, సెన్సార్ బోర్డ్ కు మధ్య రోజు రోజుకూ వివాదం పెరుగుతుండగా, తాజాగా మరో మూవీలోని కిస్ సీన్ పై బోర్డు కత్తెర వేసింది. ఇప్పుడు కాజల్ నటించిన ‘దో లఫ్జోం కీ కహానీ’ చిత్రంలో లిప్ లాక్ సీన్ పై కత్తిరింపులు వేసిందట. 


మరింత సమాచారం తెలుసుకోండి: