బోణి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కృతి కర్బందా. ఆ సినిమాతోనే యువ ప్రేక్షకల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత తీన్ మార్, మిస్టర్ నూకయ్య... తదితర సినిమాల్లో నటించింది.అయితే హిట్ మాత్రం దక్కించుకోలేక పోయింది. ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం ‘ఒంగోలు గిత్త’ సినిమాలో నటిస్తుంది. యువ హీరో రామ్ నటించిన ఈ ‘ఒంగోలు గిత్త’ సినిమా ఫిబ్రవరి 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాపై కృతి చాలా ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం హిట్టయ్యి తనకు తెలుగు లో మరన్ని ఆవకాశాలు వస్తాయని కృతి భావిస్తుంది. ఈ సినిమా స్టిల్స్ లో కూడా కృతి అందంగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. అలాగే, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఒంగోలు గిత్త చిత్రం కోసం ప్రేక్షకుల కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మనుషుల మధ్య అనుబంధాలతో సినిమాలు తీసే భాస్కర్ మాస్ సినిమా ఒంగోలు గిత్తను ఎలా మలిచాడో అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. రామ్ కు కూడా ‘ఒంగోలు గిత్త’ విజయవతం కావడం చాలా ముఖ్యం. కాగా, ఒంగోలు గిత్త సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా లిమిటెట్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు. జి.వి.ప్రకాష్ కుమార్, మణిశర్మ సంగీతం అందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: