తెలుగు ఇండస్ట్రీలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ప్రస్తుతం శభాష్ నాయుడు చిత్రంలో నటిస్తున్నారు. గత సంవత్సరం కమల్ హాసన్ ఉత్తమ విలన్ చిత్రం తర్వాత త్రిషతో కలిసి నటించిన చీకటి రాజ్యం మంచి హిట్ గా నిలిచింది. చీకటి రాజ్యం చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న కమల్ హాసన్ మరో చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రంలో ఆయన కూతురు శృతి హాసన్ నిజంగానే ఆయన కూతురుగా నటించడం విశేషం. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సమయంలో కమల్ హాసన్ ఆయన స్వగృహంలో కాలు జారి పడటంతో కాలుకి తీవ్ర గాయం కావడంతో ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటున్నారు.

అయితే ఈ గాయం మొదట చిన్నగా కనిపించినా అది కాస్త తీవ్రం కావడంతో ఆయనకు మరింత రెస్ట్ కావాల్సి ఉందని డాక్టర్లు తెలిపినట్లు సమాచారం. నిజంగా ఈ వార్త కమల్ ఫ్యాన్స్ కు పెద్ద బ్యాడ్ న్యూసే మరి . దీంతో  శభాష్ నాయుడు చిత్రానికి మరో నెల రోజుల పైనే సెలవులు వచ్చాయి. అయితే ఈ చిత్రంలో ఆయన నటించడమే కాకుండా  దర్శకత్వ నిర్మాణ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నాడు.

ఇటీవలే అమెరికాలో షూటింగ్ జరుపుకొని చెన్నై చేరుకున్న కొద్ది రోజులకే కమల్ కి గాయడం కావడంతో శభాష్ నాయుడు చిత్రానికి బ్రేక్ పడింది. ఏది ఏమైనా కమల్ కోలుకోవాలంటే కనీసం నెల రోజులకు పైగా పడుతుంది కాబట్టి ఆయన సినిమా బాగా లేట్ అవుతుందని భావిస్తున్నారు. దీంతో కమల్ హాసన్ అభిమానులకు ఇది మరీ బ్యాడ్ న్యూస్.


మరింత సమాచారం తెలుసుకోండి: