టాలీవుడ్ టాప్ హీరోలకు అత్తగా ఒక వెలుగు వెలుగుతూ భారీ పారితోషికం తీసుకుంటూ తన హవాను కొనసాగిస్తున్న నదియాకు ఒకనాటి గ్లామర్ బ్యూటీ టబు ఊహించని షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.  మరో  మూడు నెలల్లో 45 ఏళ్ల వయసు దాటిపోతున్న టబు ఇప్పటికీ బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. 

అయితే ఆమె చాలా ఏళ్ల తర్వాత  తిరిగి తెలుగులో ఒక సినిమాలో నటిస్తూ ఉండటం ఒక  విశేషం. అయితే  టాప్ హీరోయిన్ అనుష్కకు నటిస్తున్న ‘భాగమతి’ సినిమాలో
ఉండటం మరో విశేషం. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న టెక్నో థ్రిల్లర్ మూవీ ‘భాగమతి’ లో టబు సీబీఐ ఆఫీసర్ గా ఒక  కీలక పాత్రలో నటించడానికి  అంగీకారం తెలిపింది అన్న వార్తలు వస్తున్నాయి.   

అయితే ఈ సినిమా కోసం టబు తీసుకుంటున్న పారితోషిక వార్తలు మాత్రం ఇప్పుడు షాకింగ్ గా మారాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో నటిస్తున్నందులకు టబు ఏకంగా 60 లక్షలు పారితోషికంగా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాశి ఖన్నా రెజీనా లాంటి హీరొయిన్స్ కన్నా ఎక్కువగా ఈమెకు ఈ స్థాయిలో పారితోషికం ఇవ్వడానికి ఒక కారణం ఉంది అంటున్నారు.  

వాస్తవానికి  ఈ పాత్రకు నదియాను అనుకున్నారట. ఆమెకు 20 లక్షలే పారితోషకంగా ఇవ్వడానికి కూడ అంగీకారం కుదిరింది అని టాక్.  అయితే ఈ సినిమాలో టబు చేస్తున్న పోలీస్ అధికారిపాత్ర చాలా ముఖ్యమైనదే కాకుండా చాలా దర్పంగా చేయవలసి ఉండటంతో    నదియా కన్నా టబు ఈ పాత్రను బాగా నటించ గలదు అన్న ఉద్దేస్యంతో  నదియాకు జర్క్ ఇచ్చి టబు ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: