తెలుగు ఇండస్ట్రీలో  ఆ మద్య నటించిన హీరోయిన్లు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. రమ్యకృష్ణ,నదియా లాంటి హీరోయిన్లు ఇప్పుడు అమ్మ పాత్రలు, అత్త పాత్రల్లో నటించి బాగా బిజీ అయ్యారు.  తాజాగా వీరి లీస్టులోకి చేరిపోతుంది అలనాటి అందాల భామ టబు.  అతికూడా ప్రస్తుతం నెంబర్ వన్ రేసులో ఉన్న బెంగుళూరు బ్యూటీ అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న భాగమతి చిత్రంలో. ఇక ఈ ఇద్దరిని చూస్తూ ఒకే తరానికి చెందిన హీరోయిన్లలా అనిపిస్తారు..కానీ టబు చాలా సీనియర్ నటి అన్న విషయం అందరికీ తెలుసు. గత సంవత్సరం తెలుగు లో సూపర్ హిట్ చిత్రంగా వచ్చిన దృశ్యం హిందీలో రిమేక్ చేయగా తెలుగు లో నటించిన నదియా పాత్ర హిందిలో టబు చేసింది. ఇలా సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన ఈ హాట్ బ్యూటీలు ఇప్పుడు తల్లి పాత్రల్లో బాగానే అలరిస్తున్నారు.

గత పదేళ్లుగా తెలుగు సినీరంగంలో అనుష్క ప్రధాన హీరోయిన్ గా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించింది నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకు వెళ్తుంది.  ఇరవై ఏళ్ల నుంచి ఈ మధ్య కాలం వరకూ తెలుగులో టాప్ హీరోలందరితో ఆడిపాడిన టబు 'ఇదీ సంగతి', 'పాండురంగడు' చిత్రాల తరువాత టాలీవుడ్ నటించడం మానేసింది.  బాలీవుడ్ లో మాత్రం పలు హిట్ సినిమాల్లో నటించింది.  మళ్లీ ఇన్నాళ్లకు టబు తెలుగు తెరపై దర్శనమివ్వనుందట.అనుష్కకు తల్లిగా టబు కనపడనున్నట్లు తెలుస్తోంది.  వాస్తవానికి టబు పుట్టింది పెరిగింది హైదరాబాలోనే అన్నవిషయం అందరికీ తెలసిందే.

తాజాగా పిల్ల జమీందార్', 'సుకుమారుడు' చిత్రాల దర్శకుడు అశోక్ భాగమతి మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే.  ఈ చిత్రంలో అనుష్కకు తల్లిగా టబు కనపడనున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా నటిస్తుండగా ప్రభాస్ అతిథిగా మెరవబోతున్నాడట. మొత్తానికి భాగమతి ఇలాంటి కాంబినేషన్ తో ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: