మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర కధలు లేవు అంటే ఎవరు నమ్మరు. కేవలం తను ఆలోచించే కధలతో మాత్రమే సినిమాలు తీసే త్రివిక్రమ్ ఒకరు ఇచ్చిన కధలు అన్నా రీమేక్ సినిమాలు అన్న పెద్దగా ఆశక్తి చూపడు. అటువంటి వ్యక్తి పవన్ కోసం మాట తప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్తల ప్రకారం పవన్ లేటెస్ట్ గా రాసిన ఒక స్టోరీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు బాగా నచ్చిందట.
దీనితో తాను ఈ ఫిల్మ్ని డైరెక్ట్ చేస్తానని పవన్తో ఆయన అన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో పవన్ నటిస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పవన్ సొంతంగా రెడీ చేసిన కథలతో తీసిన ‘జానీ’ లేటెస్ట్ గా వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లు బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాలు చెందినా తిరిగి పవన్ ఒక కధ రాయడం ఒక హాట్ న్యూస్ అయితే ఆ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వం వహించడం మరింత సంచలనం గా మారింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అనే విషయాన్ని కాసేపు పక్కనపెడితే అయన గొప్ప రచయిత అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం త్రివిక్రమ్ కథ, మాటలు కోసం అయన సినిమాలు చూసే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. అటువంటి త్రివిక్రమ్ తన ప్రియ మిత్రుడి కోసం చేస్తున్న ఈ సాహసం టాపిక్ అఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఒక ప్రముఖ ఛానల్ ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా ఒక సామాజిక కార్యక్రమాన్ని అమీర్ ఖాన్ ‘సత్యమేవ జయతే’ మోడల్ లో రూపొందించాలని ప్రయత్నిస్తున్న ఆ టీవీ యాజమాన్యం ప్రయత్నాలకు పవన్ ఓకే చెప్పినట్లు గా వార్తలు వస్తున్నాయి.
మరొక షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఈ కార్యక్రమానికి దర్శకత్వం వహించేందుకు క్రిష్ ముందుకు వచ్చాడు అని కూడ తెలుస్తోంది. క్రిష్ దర్శకత్యం వహిస్తున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ పూర్తి అయి న వెంటనే ఈ సామజిక కార్యక్రమం షూటింగ్ ప్రారంభం అవుతుంది అని తెలుస్తోంది. పవన్ ‘జనసేన’ పార్టీని జనంలోకి తీసుకు వెళ్ళి ప్రచార ఆయుధంగా ఈ కార్య క్రమాన్ని మలుచుకోవాలని పవన్ ఆలోచన అంటున్నారు..