నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘పూలరంగడు’ సినిమా అప్పట్లో 20 కోట్ల కలక్షన్స్ వసూలు చేస్తే సునీల్ త్వరలోనే స్టార్ హీరో అయిపోతాడు అంటూ అప్పట్లో కామెంట్స్ వినిపించాయి. అయితే ఆ తరువాత సునీల్ దురధృష్టానికి  చిరునామాగా మారిపోయాడు. ఆ తరువాత విడుదలైన ‘మిస్ట‌ర్ పెళ్లికొడుకు’, ‘భీమ‌వ‌రం బుల్లోడు’ ‘కృష్ణాష్ట‌మి’ ఇప్పుడు ‘జ‌క్క‌న్న’  ఇలా అన్నీ వరస పరాజయాలుగా మారడంతో అసలు సునీల్ కు భవిష్యత్ లో సినిమాలు ఉంటాయా అనే అనుమానాలు ఏర్పడుతున్నాయి.

ఈ వార్తలు ఇలా ఉండగా సునీల్ లేటెస్ట్ మూవీ ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమా విడుదల తేదీ ప్రకటింప బడింది. డైరెక్టర్ వీరూ పోట్ల దర్శకత్వంలో నిర్మింపబడ్డ ‘ఈడు గోల్డ్ ఎహే’ సెప్టెంబరు 9న విడుదల కాబోతోంది. అంటే ‘జక్కన్న’ విడుదలైన కేవలం నెలన్నర వ్యవధిలో మరో సినిమాను విడుదల చేస్తూ సునీల్ మరో సంచలనం చేస్తున్నాడు.

భారీ అంచనాలతో తుఫాన్ లా దూసుకు వస్తున్న ‘జనతా గ్యారేజ్’ విడుదల తరువాత కేవలం ఒకేఒక్క వారం గ్యాప్ తో సునీల్ సినిమా విడుదల కాబోతూ ఉండటం ఒక సంచలనం. అయితే అదే డేట్ ను టార్గెట్ చేస్తూ సెప్టెంబరు 9న విడుదల అవుతున్న ప్రభుదేవా, తమన్నాల ‘అభినేత్రి’ కూడా లెక్క చేయకుండా సునీల్ దూసుకు రావడం ఆశ్చర్య కరంగా మారింది. 

మంచి క్రియేటివ్ దర్శకుడుగా పేరు గాంచిన వీరూ పొట్ల తీసిన ‘బిందాస్’ ‘రగడ’ ‘దూసుకెళ్తా’ సినిమాలు పెద్దగా విజయవంతం కాకపోయినా దర్శకుడుగా వీరూపోట్లకు మంచి పేరునే తెచ్చి పెట్టాయి. అయితే వరస పరాజయాలతో సతమతైపోతున్న సునీల్ తమన్నా ప్రభుదేవాల క్రేజ్ ముందు నిలబడి కనీసం ఓపెనింగ్ కలక్షన్స్ అయినా తెచ్చుకోగాలడా ? అనే ప్రశ్న ఫిలింనగర్ లో వినపడుతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: