తెలుగు ఇండస్ట్రీలో జబర్ధస్త్ ప్రోగ్రామ్ తో ఒక్కసారే ఎక్కడలేని ఇమేజ్ సంపాదించిన హాట్ యాంకర్ రేష్మీ అనతి కాలంలోనే వెండి తెరపై కూడా చాన్సులు దక్కించుకుంది.  గతంలో వెండితెరపై కనిపించినా ఈ అమ్మడు సైడ్ క్యారెక్టర్లకు మాత్రమే సొంతమయ్యేది..అలాంటిది జబర్ధస్త్ ప్రోగ్రామ్ లో వచ్చిన పాపులారిటీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా చాన్సులు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తీసిన సినిమా గుంటూర్ టాకీస్..ఈ సినిమాలో  రేష్మీ విచ్చలవిడిగా రెచ్చిపోయింది.   రేష్మీ హీరోయిన్ గా, సిద్దు హీరోగా, న‌రేష్ కీల‌క పాత్ర‌లో గుంటూరు టాకీస్ కామెడీ పరంగా ఓకే అనిపించింది. 


ఆర్.కె బ్యానర్ పై ప్ర‌వీణ్ సత్తారు డైర‌క్ష‌న్ లో అడ‌ల్ట్ కామెడీ గా తెర‌కెక్కిన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గానూ మంచి విజ‌యం సాధించింది.  ఈ త‌రుణంలో ఆర్ కె బ్యాన‌ర్ అధినేత రాజ్ కుమార్ గుంటూరు టాకీస్ కు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా గుంటూరు టాకీస్ సినిమా కంటే ఎక్కువ‌గా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని నిర్మాత తెలిపారు.


 ఈ సీక్వెల్ లో గుంటూరు టాకీస్ సినిమాలోని న‌టుల‌తో పాటు, సీనియ‌ర్ క‌మెడియ‌న్స్, న‌టులు కూడా న‌టించ‌నున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగ‌తా వివ‌రాలు త్వ‌రలోనే వెల్ల‌డి కానున్నాయి.      



మరింత సమాచారం తెలుసుకోండి: