హీరో హీరోయిన్స్ మధ్య పర్సనల్ రిలేషన్ ఉందంటూ మీడియా చేసే హడావిడి ఏ రేంజ్లో ఉంటుందో మనకు తెలిసిందే. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరితే అంతే ఇక వారి మధ్య ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ కూడా జరుగుతుందని రాస్తుంటారు. అయితే ఇలాంటి న్యూస్ ఒక్కోసారి వారిని బాగా హర్ట్ చేస్తాయి. అందుకే ఆ హీరో హీరోయిన్ ఫైర్ అవుతుంటారు.


ప్రస్తుతం రెజినా కూడా మీడియా మీద సర్రున లేస్తుంది. కెరియర్ మొదట్లో కాస్త జోష్ పెంచిన రెజినా ఈ మధ్య మంచి ఫాంలోనే ఉంది. ఇక మెగా హీరో సాయి ధరం తేజ్ తో రెండు వరుస సినిమాల్లో నటించే సరికి అతనితో సీరియస్ రిలేషన్ ఉందంటూ రాయడం మొదలు పెట్టారు. కొద్దిరోజులు హాట్ టాపిక్ అయిన ఆ న్యూస్ ఈ మధ్య తగ్గింది.


అయితే రెజినా కావాలని మళ్లీ ఆ విషయాన్ని గుర్తుచేసి మీడియాపై ఫైర్ అయ్యింది. మొన్నటిదాకా తేజ్ తో రిలేషన్ అన్నారు. ఇప్పుడేమో బికిని వేస్తుంటే అవకాశాలు లేకనే అలా చేస్తుందా అని రాస్తున్నారు. పోని ఓ పని చేయండి తేజుతో నాకు విడాకులయ్యాయని రాసేయండి అని చెడామడా వాయించేసింది రెజినా. సో అమ్మడు ఈ టాపిక్ పై ఎంత ఇబ్బంది పడ్డదో ఇప్పుడు అర్ధమైంది.


అయితే కథానాయికలన్న తర్వాత గాసిప్పులు కామనే. తేజ్ తెజినాల మధ్య సాన్నిహిత్యం చూసి ఎవరైనా అదే రేంజ్లో అనుకుంటారు. ఆ విషయంపై ఎన్నిసార్లు లేదు కాదు అని చెప్పినా వినకపోయే సరికి ఈసారి విడాకులు ఇచ్చేసుకున్నారని రాయండంటూ రెజినా కామెంట్స్ చేసింది. ఇదో రకంగా తన మీద మీడియా రాస్తున్న రూమర్లను చెక్ పెట్టే ప్రయత్నంలో భాగమే అయినా రెజినా ఈ రేంజ్ ఫైర్ అవడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.   


ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఉన్న రెజినా ఈ మధ్యనే బాలీవుడ్ ఆఫర్ ను కూడా దక్కించుకుంది. బీ టౌన్ అవకాశం వచ్చింది కదా ఇక సౌత్ సినిమాలపై దూరం పెరుగుతుందా అంటే మొదట ప్రిఫరెన్స్ ఇక్కడ సినిమాలే అంటూ వయ్యారాలు పోతుంది. మరి అక్కడ నీళ్లు పడితే ఇక్కడ పరిశ్రమ గుర్తుకు రాదన్న సంగతి ముందు హీరోయిన్స్ తో మనకు అనుభవమే కదా.



మరింత సమాచారం తెలుసుకోండి: