పవన్ మరో రెండు రోజులలో కాకినాడలో జరపబోతున్న బహిరంగ సభ హీట్ మధ్యలో పవన్ కళ్యాణ్ పై మరో షాకింగ్ రూమర్ రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం పవన్ ఈమధ్య కాలంలో భాగ్యనగరంలో కొన్ని సైట్స్ ను రియలెస్టేట్ దృష్టిలో పెట్టుకుని కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఎప్పుడూ లేని విధంగా పవన్ ఇలా బిజినెస్ పరంగా కూడ ఆలోచించడం ఆశ్చర్యకరం అని అంటున్నారు. అయితే పవన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అతడి సన్నిహితుల ప్రభావం ఉందా లేకుంటే పవన్ వ్యక్తిగాతంగానే భవిష్యత్ ను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడా అనే విషయమై రకరకాల భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటూ ఉన్నా అతడు చెన్నైలో ఉన్నప్పుడు అనేక అపార్ట్ మెంట్లు సైట్స్ చిరంజీవి అప్పట్లోనే కొన్నాడు అన్న వార్తలు ఉన్నాయి.  చెన్నైలోని చిరంజీవి ఆస్తులను మేనేజ్ చేయడానికి చిరంజీవి ఇప్పటికీ చెన్నైలో ఒక ప్రత్యేకమైన ఆఫీసు పెట్టి అక్కడి ఆస్థుల వ్యవహారాలను మ్యానేజ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన టీమ్ ను ఏర్పాటు చేసాడు అన్న వార్తలు గతంలోనే వచ్చాయి.

ఇప్పుడు అదే స్పూర్తితో రానున్న కాలంలో విశ్వనగరంగా మారబోతున్న హైదరాబాద్ లోని కొన్ని స్థలాలను ఇప్పటికే పవన్ కొన్నాడు అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి.  ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా మారుతున్న పరిస్థుతులలో పవన్ కళ్యాణ్ కూడ మారిపోయాడా అని అనిపించడం సహజం.

ఇది ఇలా ఉండగా రేణు దేశాయ్ గత ఆదివారం ఈటివి లో ప్రసారం అయిన తన ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాను చాలామంది చూసినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ సినిమా ప్రసారానికి మంచి రేటింగ్స్ కూడ వచ్చాయి అన్న విషయాలను బయట పెట్టింది.  ఇదే సందర్భంలో పవన్ అభిమానులకు మరొక సారి జోష్ ఇవ్వడానికి గతంలో ఆమె తీసిన పవన్‌ ఫొటోలలో మరొక ఫోటోను తన ఫేస్ బుక్ లో షేర్ చేసింది.

ఈ ఫోటోలో  తన కనుబొమ్మని పైకి పెట్టుకుని పోజు ఇస్తున్న పవన్‌ మ్యానరిజం చూస్తూ ఉంటే తనకు అసూయగా ఉందని ట్విట్ చేసింది.  ఈ ఫోత్ను తానెక్కడా ఎడిట్ చేయలేదని ఆ రంగు నిజమే అంటూ ట్విట్ చేసింది.  పవన్ యోగా డైట్ చేయడం వల్లే ఆయన స్కిన్ అంత ప్రకాశమంతంగా ఉంటుందని మరో విషయాన్ని బయట పెడుతూ రేణూ దేశాయ్ మరొకసారి పవన్ కు సంబంధించిన వార్తలకు హాట్ టాపిక్ గా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: