నిన్నరాత్రి భాగ్యనగరంలో జరిగిన ‘ప్రేమమ్’ ఆడియో ఫంక్షన్ లో నాగార్జున తన కొడుకు నాగచైతన్య లుక్ గురించి కామెంట్ చేస్తూ ఒక విచిత్రమైన పోటీ తన అభిమానులకు పెట్టాడు.  నాగ్ చైతన్య పెంచుకున్న గెడ్డం గురించి మాట్లాడుతూ తన అభిమానులకు ఒక పోటీ పెట్టి ఆ ఆడియో ఫంక్షన్ కు జోష్ ను కలిగించాడు.

చైతన్య ‘ప్రేమమ్’ సినిమా కోసం గెడ్డం పెంచినప్పుడు తనకు ఆ లుక్ నచ్చి తాను కూడ ప్రస్తుతం లేటెస్ట్ గా నటిస్తున్న ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా కోసం గెడ్డం పెంచిన విషయాన్ని బయట పెట్టాడు. అయితే తాను ప్రస్తుతం గెడ్డంతో ఉన్న లుక్ బాగుందా ? లేదంటే చైతన్య గెడ్డం లుక్ బాగుందా ? అంటూ తన అభిమానులను నాగ్ ప్రశ్నించే సరికి ‘ప్రేమమ్’ ఆడియో ఫంక్షన్ కు వచ్చిన అభిమానులంతా బహిరంగంగానే చేతులు ఊపుతూ నాగార్జునకే ఓటు వేసారు.

దీనితో మరింత జోష్ లోకి వెళ్ళి పోయిన నాగార్జున  చైతన్య కూడ తన గెడ్డం లుక్ కన్నా  నీ గెడ్డమే బాగుంది అని కామెంట్ చేసాడు అంటూ చైతూ వైపు చూసి సెటైర్ వేసాడు నాగ్.  ఇదే సందర్భంలో మాట్లాడుతూ నాగార్జున అక్కినేనికి ‘ప్రేమాభిషేకం’ తనకు ‘గీతాంజలి’ సినిమాలు లా చైతన్యకు ‘ప్రేమమ్’ ఒక ట్రెండ్ ను సెట్ చేసే సినిమాగా మారుతుంది అంటూ ఆ సినిమా పై అంచనాలు పెంచేసాడు.

ఇదే సందర్భంలో నాగార్జున మరో ట్విస్ట్ ఇస్తూ ‘ప్రేమమ్’ సినిమాలోని ‘ఎవరే’ పాట పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఎవరే పాట వినమంటూ తనకు చైతన్య సీడీ ఇచ్చిన రోజు నుంచి ఆ పాటకు తాను అడిక్ట్ అయిపోయాను అంటూ కామెంట్స్ చేసాడు.  అంతేకాదు ప్రతిరోజూ ఉదయాన్నే ఆ పాట ఒకసారి విన్నాకే తాను రోజువారి కార్యక్రమాలు  ప్రారంభిస్తున్నాను అంటూ ‘ప్రేమమ్’ చాల అంచనాలు పెట్టుకున్నాడు నాగ్.

మలయాళ సినిమా ‘ప్రేమమ్’ లో కూడా ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది. రాజేష్ కంపోజ్ చేసిన ఈ ట్యూన్ ను తెలుగులో కూడా యధాతధంగా దింపేసారు. మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ లిరికల్ గా కూడ చాల బాగా ఉండటంతో ఈ పాట ఈ ఏడాది బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: