స్టార్ సెలబ్రిటిలు ఏదైనా కొత్తగా చేస్తే...దానికి విశేష ఆధరణ దొరికితే మాత్రం మిగత వారు సైతం అదే రూటుని ఎంచుకుంటారు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి చక్కెర్లు కొడుతుంది. వాటి వివరాలను చూస్తే…సూపర్‌స్టార్ మహేష్‌బాబు సతీమణి నమ్రత తాజాగా తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఈ నెల 21న తన ఇద్దరు పిల్లలతో కలిసి నమ్రత ఏడుకొండవాడిని దర్శించుకున్న విషయం తెలిసిందే.


అయితే నమ్రత తలనీలాలు సమర్పించటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గ్లామర్ గా ఉన్న సెలబ్రిటీలు తలనీలాలు సమర్పించుకుంటే…ఈ హైఫై సొసైటీలో కొంచెం ఇబ్బందులు తప్పవు. అలా కాకుండా నమ్రత తలనీలాలు సమర్పించి మరింత క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. తలనీలాలు సమర్పించడం అనేది ప్రొఫెషినల్ లైఫ్ కి ఏ మాత్రం అడ్డంకి కాదని నమ్రత స్పష్టంగా చెప్పుకొచ్చింది.


ఇక అప్పడప్పుడూ సినిమాలు చేస్తున్న టాప్ హీరోయిన్స్….ప్రస్తుతం నమ్రత రూటుని ఫాలో అవ్వాలని చూస్తున్నారు. పలుసార్లు ఆ ఏడుకొండలవాడి దగ్గరకు వెళ్లి కోరికలు కోరుకుంటున్నారే కానీ…వారి మొక్కులను చెల్లించటం లేదు. అలాంటి పెండింగ్ పనులను ఈసారి క్లియర్ చేసుకోవాలని పలువురు హీరోయిన్స్ చూస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ శ్రేయ త్వరలోనే తిరుమల వేంకటేశ్వరుడికి తలనీలాలను సమర్పించుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే తను పలుసార్లు తిరుమల వేంకటేశ్వరస్వామిని కలిసి వారి కోర్కెలను వేడుకున్నారు.


ప్రస్తుతం చిరుతో చేస్తున్న ఖైదీనెం.150వ చిత్రం షెడ్యల్ మరో నెల రోజుల్లో అయిపోతుంది. దీని తరువాత తను తిరుమలకి వెళ్లి తలనీలాలు సమర్పించుకునే ఛాన్స్ ఉందనేది ఇండస్ట్రీనుండి అందుతున్న సమాచారం. ఇక నమ్రత చేయించుకున్న గుండుకి నెటిజెన్స్ మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ‘మాజీ మిస్ ఇండియాగా ఉన్న నమ్రత ఈ విధంగా చేసిందంటే నిజంగా గ్రేట్ అని అంటున్నారు. నమ్రత 2005లో టాలీవుడ్ హీరో మహేష్‌బాబును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఒక పాప, బాబు ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: