చిరంజీవి మేనల్లుడు సాయి ధర్మతేజ్ కథనాయకుడుగా గీతా ఆర్ట్స్ ఒక చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాకు ఎ.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా రెజీనా హీరోయిన్ గా నటిస్తుంది. మొదటి షెడ్యూల్ పూర్తయిన ఈ చిత్రం రెండవ షెడ్యూల్ సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు బన్నీ వాసు, హర్షిత్ లు మాట్లాడుతూ ‘ ఈ తరానికి చెందిన ప్రేమకథతో సినిమా తెరకెక్కుతుంది. శ్రీహరి ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తాడు’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సాయిధర్మతేజ్-రెజీనా ల నటన, వారి కెమిస్ర్టీ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయని’ చెప్పారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.. కాగా, సాయిధర్మతేజ్ హీరోగా పరిచయం కానున్న ‘రేయ్’ సినిమా ఈ వేసవిలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: