రజినీకాంత్ తాజా చిత్రానికి రూ.100 కోట్ల నిర్మాణ వ్యయం అని ఈ మధ్య చాలా వార్తలే వచ్చాయి. ఈ చిత్రానికి కె.వి. ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘రంగం’, ‘బ్రదర్స్’ లాంటి భిన్నమైన కథాంశాలతో సినిమాలు తీసే ఆనంద్... రజినీకి కూడా ఓ వెరైటీ కాన్సెప్టే చెప్పారట. దాంతో చిత్రీకరణ కాస్త భారీగానే ఉండాల్సి వస్తుందని దర్శకుడు భావించారు. సాంకేతిక నిపుణులను కూడా విదేశాల నుండి రప్పించాలనుకున్నారు. ఈ వార్తలకు కాస్త మసలా జోడించి ఏకంగా దీని బడ్జెట్ ను కొన్ని వార్తా సంస్థలు ఏకంగా వంద కోట్లకు తీసుకెళ్లిపోయాయి. అంత బడ్జెట్ ఈ చిత్రానికి అవసరం లేదని దర్శకుడు ఆనంద్ ఇటీవలే తన ట్విటర్ లో వెల్లడించారు. మీడియాలో వస్తున్న కథనాలని నమ్మొద్దని ఆయన రజినీ అభిమానులను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: