పాత తమిళ సినిమాల డబ్బా దులిపి తెలుగులో విడుదల చేసే సంస్కృతి కొనసాగుతూనే ఉంది. ఏడేళ్ల క్రితం సూర్య, త్రిష జంటగా నటించిన తమిళ చిత్రం ఇప్పడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదే... `కంచు`.
ఇంకో విషయం ఏమిటంటే ఈ తమిళ బొమ్మని ఇది వరకెప్పుడో మనవాళ్లే రీమేక్ కూడా చేసేశారు. `ఆడంతే అదో టైపు` పేరుతో. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో దారుణంగా బోల్తా పడింది. అయినా ఇప్పుడు తెలుగులో తీసుకొస్తున్నారు. ఇదో ప్రేమ కథ. అయితే మాస్ కోసం `కంచు` అనే పేరు పెట్టారు.
పోస్టరుపై కనిపిస్తున్న సూర్య, త్రిష బొమ్మలు కూడా ఈ సినిమాలోనివి కావు. ఎక్కడివో తీసుకొచ్చి ఇక్కడ అతికించారు. మరీ మన ప్రేక్షకుల్ని ఇంతిలా మోసం చేయడం అవసరమా?
మరింత సమాచారం తెలుసుకోండి: