క‌ల్యాణ్‌రామ్ చావో రేవో తేల్చుకోబోతున్నాడు. క‌త్తి వ‌చ్చి రెండేళ్లు దాటిపోతున్నా.... ఆయ‌న నుంచి సినిమా రాలేదు. ఓమ్ సినిమా సుదీర్ఘంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొంటోంది. త్రీడీ సినిమా కాబ‌ట్టి... పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లోనూ జాప్యం జ‌రుగుతోంది. ఈ సినిమాకి ఇప్ప‌టికే బ‌డ్జెట్ మించిపోయింది. క‌ల్యాణ్‌రామ్ మార్కెట్‌ని ఎప్పుడో మించిపోయింది. అయినా ఈ నంద‌మూరి క‌థానాయ‌కుడు ఇంకా... ఇంకా పెట్టుబ‌డి పెడుతూనే ఉన్నాడ‌ట‌. కార‌ణం... ఈ సినిమాపై ఉన్న న‌మ్మ‌క‌మే. అత‌ను అనుకొన్న‌ట్టే ఈ సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ట‌. ఈ మాట ఆ సినిమాకి ప‌నిచేసిన వాళ్లు చెబితే న‌మ్మ‌క పోవ‌చ్చు. కానీ... చెబుతున్న‌ది ఎవ‌రో తెలుసా? రామ్‌చ‌ర‌ణ్‌. ఆయ‌న‌కీ ఈ సినిమాకీ సంబంధం ఏమిటంటే.... ఈ సినిమా ద‌ర్శ‌కుడు సునీల్ రెడ్డి... చ‌ర‌ణ్‌కి మంచి ఫ్రెండ్ అట‌. ఈ సినిమాలోని కొన్ని దృశ్యాల‌ను చ‌ర‌ణ్‌కి ప్ర‌త్యేకంగా చూపించాడ‌ట‌. అవి చూసి చ‌ర‌ణ్ చాలా థ్రిల్ల‌య్యాడు. ఈ విష‌యం చ‌ర‌ణ్ స్వ‌యంగా చెప్పాడు. ``ఓమ్‌లోని కొన్ని స‌న్నివేశాలు చూశా. సూప‌ర్బ్‌గా ఉన్నాయి. త్రీడీ సినిమా.. ఇలాక్కూడా తీయొచ్చా.. అనిపించింది. భ‌విష్య‌త్తులో త్రీడీ క‌థ‌లొస్తే త‌ప్ప‌కుండా చేస్తా`` అంటున్నాడు, ఓ హీరో మ‌రో హీరో సినిమాకి కాంప్లిమెంట్ ఇచ్చాటంటే గ్రేటే.

మరింత సమాచారం తెలుసుకోండి: